ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో హారర్ కథలు తెగ స్ట్రీమింగ్ అవుతున్నాయి. మూవీ లవర్స్ ఎక్కువగా థ్రిల్లింగ్ చిత్రాలను చూసేందుకు ఆసక్తి చూపించడంతో అలాంటి తరహా కంటెంట్ సినిమాలు రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లా్న్ చేస్తున్నారు. అయితే ఇన్నాళ్లు ఓటీటీలో ఆకట్టుకున్న ఓ హరర్ సస్పెన్స్ మూవీ ఇప్పుడు టీవీల్లోకి రాబోతుంది. అదే డిమోంటీ కాలనీ 2. బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది ఈ మూవీ. అరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీ మంచి అంచనాలతో వచ్చి మెప్పించింది. తమిళంలో ఆగస్ట్ 15న థియేటర్లలో రిలీజ్ కాగా.. తెలుగులో ఆగస్టు 23న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు భాషల్లోనూ మంచి వసూళ్లు రాబట్టింది.
ఇక ఇప్పుడు ఈ సినిమా తెలుగు వెర్షన్ టీవీల్లోకి వస్తుంది. ఈ సినిమాను దీపావళీ కానుకగా అక్టోబర్ 31న మధ్యాహ్నం 3 గంటలకు జీ తెలుగు టీవీలో ప్రసారం కానుంది. దీపావళీ సందర్భంగా ఈ చిత్రాన్ని అడియన్స్ ముందుకు రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీలో అత్యధిక వ్యూస్ తో దూసుకుపోతుంది. డిమోంటి కాలనీ 2 చిత్రం సెప్టెంబర్ 27వ తేదీన జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతోపాటు తమిళంలోనూ అందుబాటులోకి వచ్చింది.
Santhosham Movie : నాగార్జున సంతోషం మూవీ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు గుర్తుపట్టడం కష్టమే..
ప్రస్తుతం జీ5లో ట్రెండింగ్ లో టాప్ లో దూసుకుపోతుంది. డిమోంటీ కాలనీ 2 చిత్రానికి అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వం వహించగా.. 2015లో వచ్చిన డిమోంటీ కాలనీ సినిమాకు సీక్వెల్ గా తొమ్మిదేళ్ల తర్వాత ఈ చిత్రం వచ్చింది. ఫస్ట్ పార్ట్ కు పాజిటివ్ టాక్ రాగా.. సెకండ్ పార్ట్ కూడా మంచి వ్యూస్ రాబట్టింది.
ఇది చదవండి : Santhosham Movie : నాగార్జున సంతోషం మూవీ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు గుర్తుపట్టడం కష్టమే..
Jr.NTR: వార్ 2 నుంచి ఎన్టీఆర్ ఫోటో లీక్.. మాస్ అండ్ రగ్గడ్ లుక్లో తారక్.. వేరేలెవల్ అంతే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.