టీవీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన టీవీ సిరీస్ CID. అత్యంత ఎక్కువ టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకున్న సీరియల్ ఇదే. కొన్నేళ్లపాటు బుల్లితెరపై ప్రేక్షకులను అలరించిన ఈ సిరీస్ ఇప్పుడు మళ్లీ రాబోతుంది. దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత .. సోనీ ఎంటర్టైన్మెంట్ టెలివిజన్లో కొత్త ట్విస్టులతో షో కనిపించనుంది. ఈ సంవత్సరం ఎపిసోడ్లో, షోలో ప్రేక్షకులు చాలా కొత్త విషయాలను, ఆద్యంతం ఊహించని ట్విస్టులు అందించనున్నారు. నిజానికి సీఐడీ మొదటి ఎపిసోడ్ టీవీలో 1998లో ప్రసారమయ్యింది. ఆ తర్వాత ‘సీఐడీ’ 20 ఏళ్లపాటు అభిమానులను అలరించింది. అయితే ఈ షోను ఆకస్మాత్తుగా షోను ఆపేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారు. దీంతో బుల్లితెర అడియన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.
20 ఏళ్లపాటు బుల్లితెర అడియన్స్ హృదయాలను ఏలిన ఈ షో.. ఇప్పుడు ఆరేళ్ల తర్వాత మళ్లీ ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను కూడా విడుదల చేశారు. సోనీ టీవీ తన అధికారికలో ఈ షో ప్రోమోను రిలీజ్ చేశాడు. తాజాగా విడుదలైన ప్రోమోలో అభిజీత్ దయాను ఎందుకు చంపాడు ? అనే సస్పెన్స్ క్రియేట్ చేశారు.
అభిజీత్ తన ఎన్నో ఏళ్ల స్నేహాన్ని మర్చిపోయి దయాను షూట్ చేశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదాన్ని చూసిన ACP ప్రద్యుమన్ ఇద్దరి మధ్య వాగ్వాదాన్ని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాడు. కానీ అభిజీత్ షూట్ చేయడంతో దయ మరణిస్తాడు. దీంతో అభిజిత్ తన స్నేహితుడు దయను ఎందుకు చంపాడు ? అనే సస్పెన్స్ క్రియేట్ చేయడంతో ఈ షో చూసేందుకు అడియన్స్ ఎదురుచూస్తున్నారు.
ఇది చదవండి : Santhosham Movie : నాగార్జున సంతోషం మూవీ హీరోయిన్ గుర్తుందా.. ? ఇప్పుడు గుర్తుపట్టడం కష్టమే..
Jr.NTR: వార్ 2 నుంచి ఎన్టీఆర్ ఫోటో లీక్.. మాస్ అండ్ రగ్గడ్ లుక్లో తారక్.. వేరేలెవల్ అంతే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.