బండ్ల బ్యాక్ టూ సిల్వర్ స్క్రీన్..?

|

Apr 18, 2019 | 1:12 PM

మహేష్ బాబు మహర్షి సినిమా మే 9 వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ కు సిద్ధం అవుతున్నది.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నెల 17తో సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈ సినిమా తరువాత మహేష్ బాబు… ఎఫ్ 2 దర్శకుడు అనిల్ రావిపూడితో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ సినిమాలో మహేష్ తో పాటు హీరోయిన్‌గా రష్మిక మంధాన నటించనుంది. […]

బండ్ల బ్యాక్ టూ సిల్వర్ స్క్రీన్..?
Follow us on

మహేష్ బాబు మహర్షి సినిమా మే 9 వ తేదీన భారీ ఎత్తున రిలీజ్ కు సిద్ధం అవుతున్నది.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ నెల 17తో సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఈ సినిమా తరువాత మహేష్ బాబు… ఎఫ్ 2 దర్శకుడు అనిల్ రావిపూడితో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.

ఈ సినిమాలో మహేష్ తో పాటు హీరోయిన్‌గా రష్మిక మంధాన నటించనుంది. ఇంకా పూర్తి నటీనటుల వివరాలు తెలియరాలేదు. తాజా సమాచారం ప్రకారం ఇందులో ఓ స్టార్ ప్రొడ్యూసర్‌గా మారిన కమెడీయన్ తిరిగి నటుడుగా కనిపించబోతున్నాడని తెలుస్తోంది.  ఆయన ఎవరో కాదు.. ఒకప్పుడు స్టార్ హీరోలతో హై బడ్జెట్ సినిమాలు తీసి, మొన్నటి వరకు పొలిటికల్ స్పీచ్‌లతో రచ్చ చేసిన బండ్ల గణేష్. ఎన్నికల ముందు వరకు హైపర్ యాక్టీవ్‌గా ఉన్న బండ్ల గణేష్.. ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీపై ఆయన పెట్టుకున్నఅంచనాలు తారుమారు అవడంతో పాలిటిక్స్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు. మరి ఈ వెరీ ‘గుడ్డు’ ప్రొడ్యూసర్ మళ్లీ సిల్వర్ స్క్రీన్‌పై తన కామెడీ టైమింగ్‌తో రచ్చ చేస్తాడో, లేదో చూడాలి.