ప్రారంభమైన ఆర్జీవీ బయోపిక్‌.. కెమెరా స్విచ్ఛాన్ చేసిన వర్మ తల్లి

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై పలువురు బయోపిక్‌లు ప్రకటించిన నేపథ్యంలో ఆయన మరో అడుగు ముందుకేశారు

ప్రారంభమైన ఆర్జీవీ బయోపిక్‌.. కెమెరా స్విచ్ఛాన్ చేసిన వర్మ తల్లి

Updated on: Sep 16, 2020 | 11:37 AM

Ram Gopal Varma Biopic: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై పలువురు బయోపిక్‌లు ప్రకటించిన నేపథ్యంలో ఆయన మరో అడుగు ముందుకేశారు. తన దర్శకత్వ పర్యవేక్షణలో తన బయోపిక్ తెరకెక్కుతుందంటూ ఆ మధ్యన ప్రకటించారు. ఇక ఈ బయోపిక్‌కి సంబంధించిన మొదటి అడుగు తాజాగా పడింది. రామ్ గోపాల్ వర్మ బయోపిక్‌కి సంబంధించి తొలి భాగం షూటింగ్‌ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఓ కాలేజీలో వర్మ బయోపిక్ స్టార్ట్‌ అయ్యింది.

ఈ సందర్భంగా వర్మ తల్లి సూర్యవతి కెమెరా స్విచ్ఛాన్ చేశారు. అలాగే ఆయన సోదరి విజయ క్లాప్ కొట్టారు. మూడు భాగాల్లో వర్మ బయోపిక్‌ రానుంది. ఈ మూడు భాగాలను బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై బొమ్మకు మురళి నిర్మిస్తున్నారు. ఇక మొదటి భాగానికి దొరసాయి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాదు ఈ భాగంలో వర్మ పాత్రలోనూ తేజ నటిస్తున్నారు. ఈ పార్ట్‌లో వర్మ కాలేజీ రోజులు, తొలి ప్రేమలు, గ్యాంగ్ ఫైట్స్‌ మొదలైనవి చూపించనున్నారు. అలాగే శివ చేయడానికి గల కారణాలను చూపించనున్నట్లు తెలుస్తోంది.

Loading...
Unable to load recommendations.
Follow Us