Rakul Preet Singh: బాలీవుడ్లో సుశాంత్ అనుమానాస్పద మృతి కేసు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ కేసులో డ్రగ్స్ కోణం కూడా బయటపడటంతో దర్యాప్తు చేసిన ఎన్సీబీ.. రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ సహా 16 మందిని అరెస్ట్ చేసింది. అయితే ఈ కేసు విచారణలో రియా పలువురు ప్రముఖుల పేర్లను బయటపెట్టిందని వార్తలు వచ్చాయి. అందులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా ఉన్నట్లు గాసిప్లు వినిపించాయి. ఈ క్రమంలో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తనపై వచ్చే ప్రసారాలను ఆపేలా చర్యలు తీసుకోవాలని ఆమె అభ్యర్థించింది. దానిపై స్పందించిన హైకోర్టు.. రకుల్ చేసిన విజ్ఞప్తిపై కేంద్రం తన వైఖరిని తెలపాలని కోరింది.
ఇదిలా ఉంటే డ్రగ్స్ కేసులో తన పేరు రావడం చూసి షాక్కి గురయ్యానని రకుల్ చెప్పుకొచ్చింది. సారా అలీ ఖాన్, డిజైనర్ సైమోన్ ఖంబత్తతో పాటు నా పేరును చూసి షాక్కి గురయ్యా. నేను ఫిట్నెస్కి చాలా ప్రాధాన్యతను ఇస్తా. సినిమా కథలో ఉంటే నేను స్మోక్ చేస్తాను తప్ప ఇంకెప్పుడు తాగను అని వివరించారు. అంతేకాదు తాను ఎప్పుడూ డైట్లో ఉంటానని అన్నారు. కాగా ప్రస్తుతం రకుల్ తెలుగులో వైష్ణవ్ తేజ్ సరసన ఓ చిత్రంలో, నితిన్ సరసన ఓ మూవీలో నటిస్తున్నారు.
Read More:
నితిన్ ‘అంధాధూన్’ రీమేక్.. హీరోయిన్లు ఫిక్స్
మహాసముద్రం: శర్వానంద్కి హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే..!