మహాసముద్రం: శర్వానంద్కి హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే..!
ఆర్ఎక్స్ 100తో టాలీవుడ్కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అజయ్ భూపతి.. రెండో చిత్రంగా శర్వానంద్తో 'మహాసముద్రం'ను తెరకెక్కించనున్న
Sharwanand Mahasamudram movie: ఆర్ఎక్స్ 100తో టాలీవుడ్కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన అజయ్ భూపతి.. రెండో చిత్రంగా శర్వానంద్తో ‘మహాసముద్రం’ను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. యాక్షన్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. బైలింగ్వల్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ మూవీలో సిద్ధార్థ్ మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఇందులో హీరోయిన్గా పలువురి పేర్లు వినిపించాయి. సమంత, సాయి పల్లవి, ఐశ్వర్య రాజేష్ ఇలా పలువురి పేర్లు రాగా.. తాజా మరో నటి పేరు వెలుగులోకి వచ్చింది.
గ్యాంగ్ లీడర్తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక అరుల్ మోహన్ని ఈ మూవీ కోసం సంప్రదించినట్లు సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ప్రతి వారం ఒక్కో ఇంట్రస్టింగ్ అప్డేట్ని ఇస్తామని చెప్పిన మూవీ యూనిట్.. వచ్చే వారం హీరోయిన్కు సంబంధించిన ప్రకటన ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రియాంక ఖరారు అయ్యిందని, ఆమె పేరును వచ్చే ఏడాది ప్రకటించనున్నారని సమాచారం. కాగా ప్రియాంక ఇప్పటికే శర్వా సరసన శ్రీకారంలో నటిస్తుండగా.. తాజా వార్తలు నిజమైతే అతడితో వరుసగా రెండోసారి జత కట్టనుంది ఈ భామ. మరి ఇందులో నిజమెంత..? శర్వాతో ప్రియాంక రెండోసారి జతకడుతుందా..? పలు ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
Read More:
సుశాంత్ ఇంట్లో రియా పార్టీలు.. షోవిక్ ఎప్పుడూ మత్తులో కనిపించేవాడు