Kushi OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘ఖుషి’.. విజయ్‌, సమంతల సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

|

Sep 14, 2023 | 1:46 PM

టాలీవుడ్‌ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి. టైటిల్‌తోనే ఈ సినిమాకు పాజిటివ్‌ వైబ్స్‌ రావడం, దీనికి తోడు టీజర్లు, సాంగ్స్‌, ట్రైలర్లు ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అనుకున్నట్లే సెప్టెంబర్‌ 1 న థియేటర్లలో రిలీజైన ఖుషి సినిమా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. విజయ్‌, సమంతల కెమిస్ట్రీ వర్కవుట్ కావడం, ఫ్యామిలీ ఆడియెన్స్‌ నుంచి కూడా మౌత్‌ టాక్‌ బాగా రావడంతో బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లే వచ్చాయి

Kushi OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ఖుషి.. విజయ్‌, సమంతల సినిమా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kushi Movie
Follow us on

టాలీవుడ్‌ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ఖుషి. టైటిల్‌తోనే ఈ సినిమాకు పాజిటివ్‌ వైబ్స్‌ రావడం, దీనికి తోడు టీజర్లు, సాంగ్స్‌, ట్రైలర్లు ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. అనుకున్నట్లే సెప్టెంబర్‌ 1 న థియేటర్లలో రిలీజైన ఖుషి సినిమా పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. విజయ్‌, సమంతల కెమిస్ట్రీ వర్కవుట్ కావడం, ఫ్యామిలీ ఆడియెన్స్‌ నుంచి కూడా మౌత్‌ టాక్‌ బాగా రావడంతో బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లే వచ్చాయి. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లోవెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్, జయరాం, సచిన్‌ కేడ్కర్‌, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి ఖుషి సినిమాను నిర్మించారు. థియేటర్లలో ఇప్పటికీ ఈ సినిమా ఆడుతోంది. మరోవైపు ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని విజయ్‌, సామ్‌ ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో ఖుషి సినిమా ఓటీటీ రిలీజ్‌ గురించి సామాజిక మాధ్యమాల్లో ఒక వార్త చక్కర్లు కొడుతోంది. విజయ్‌, సామ్‌ల సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ కొనుగోలు చేసింది. అక్టోబర్‌ 6 నుంచి ఈ సినిమా డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు రానుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఖుషి సినిమా ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.

ఖుషి సినిమా తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళ భాష ల్లో పాన్‌ ఇండియా స్థాయిలో రిలీజైంది. కాబట్టి ఓటీటీలో కూడా ఈ భాషల్లోనే రిలీజ్ కావొచ్చని సమాచారం. ఖుషి సినిమాకు హిషామ్ అబ్దుల్ వాహబ్ అందించిన స్వరాలు హైలెట్‌గా నిలిచాయి. ప్రవీణ్‌ పూడి ఎడిటర్‌గా వ్యవహరించారు. ఇక ఖుషి సినిమా తర్వాత పరశురాం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు విజయ్‌. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన గీత గోవిందం బ్లాక్‌ బస్టర్‌హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. VD13 (వర్కింగ్‌ టైటిల్‌) పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మృణాళ్‌ ఠాకూర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను రిలీజ్‌ చేసే యోచనలో ఉన్నారు మేకర్స్‌.

ఇవి కూడా చదవండి

సమంత లేటెస్ట్ ఫొటోస్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..