
ఈ మధ్యన నిజ జీవిత సంఘటనలు, ప్రముఖ వ్యక్తుల ఆధారంగా సినిమాలు, వెబ్ సిరీస్ లు తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఆడియెన్స్ కూడా వీటిని చూసేందుకు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీలో ఈ రియల్ స్టోరీలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఓ రియల్ క్రైమ్ స్టోరీనే. మూఢనమ్మకాలు, చేతబడుల నేపథ్యంలో ఈ సిరీస్ ను రూపొందించారు. 2018లో దేశ రాజధాని ఢిల్లీలోని బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పదంగా చనిపోయారు. 9 నుంచి 71 ఏళ్ల మధ్య ఉన్న మూడుతరాలకు చెందిన కుటుంబీకులు అంతా మూకుమ్మడిగా ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంటారు. మరి ఆ 11 మంది చావులకు కారణమేంటి? అసలు అవి ఆత్మహత్యలా? హత్యలా? లేకుంటే ఎవరైనా వారిని బలిదానాలకు ప్రేరేపించారా? అన్న నేపథ్యంలో ఈ సిరీస్ ఆద్యంత ఆసక్తికరంగా సాగుతుంది. పోలీసుల విచారణ ఎలా సాగింది? దర్యాప్తులో ఏం తేలింది? అన్న ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే.
మిల్కీ బ్యూటీ తమన్నా లీడ్ రోల్ లో నటించిన ఈ సిరీస్ పేరు ఆఖరి సచ్.రాబీ గ్రేవెల్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్కు సౌరవ్ దేవ్ కథను అందించారు. నిర్వికార్ ఫిల్మ్స్ సంస్థ నిర్మించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో తమన్నాతో పాటు అభిషేక్ బెనర్జీ, శివిన్ నారంగ్, దనిష్ ఇక్బాల్, నిషూ దీక్షిత్, క్రితి విజ్, సంజీవ్ చోప్రా కీలక పాత్రలు పోషించారు.
ప్రస్తుతం ఈ ఆఖరి సచ్ వెబ్ సిరీస్ జియో హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీతో పాటు తెలుగు స్ట్రీమింగ్ కూడా అందుబాటులో ఉంది. మంచి క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ చూడాలనుకునేవారికి ఇదొక మంచి ఛాయిస్ అని చెప్పవచ్చు.
A bone chilling tale that unravels the most twisted ties of fate, trapped secrets of a family and
terrifying horrors an investigator has ever seen. Watch #HotstarSpecials #AakhriSach from 25th
August.#AakhriSachOnHotstar pic.twitter.com/8TQm0m503U— JioHotstar (@JioHotstar) August 11, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.