Mr Nagabhushanam OTT: మౌనికా రెడ్డి మరో ఇంట్రెస్టింగ్‌ వెబ్‌ సిరీస్‌.. ‘మిస్టర్‌ నాగ భూషణం’ స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

|

Oct 11, 2023 | 12:42 PM

మౌనికా రెడ్డి.. యూట్యూబ్‌లో షార్ట్‌ ఫిల్మ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. అలాగే షణ్ముఖ్‌ జస్వంత్ సూర్య వెబ్‌ సిరీస్‌తో బాగా పాపులర్‌ అయింది.ఆ మధ్యలో పవన్‌ కల్యాణ్‌ 'భీమ్లానాయక్‌' సినిమాలోనూ సందడి చేసింది. టూ సోల్స్‌, థాంక్యూ బ్రదర్‌తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో నటించి మెప్పించిందీ ట్యాలెంటెడ్‌ యాక్ట్రెస్‌.

Mr Nagabhushanam OTT: మౌనికా రెడ్డి మరో ఇంట్రెస్టింగ్‌ వెబ్‌ సిరీస్‌.. మిస్టర్‌ నాగ భూషణం స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?
Mr Nagabhushanam Web Series
Follow us on

మౌనికా రెడ్డి.. యూట్యూబ్‌లో షార్ట్‌ ఫిల్మ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. అలాగే షణ్ముఖ్‌ జస్వంత్ సూర్య వెబ్‌ సిరీస్‌తో బాగా పాపులర్‌ అయింది.ఆ మధ్యలో పవన్‌ కల్యాణ్‌ ‘భీమ్లానాయక్‌’ సినిమాలోనూ సందడి చేసింది. టూ సోల్స్‌, థాంక్యూ బ్రదర్‌తో పాటు మ‌రికొన్ని సినిమాల్లో నటించి మెప్పించిందీ ట్యాలెంటెడ్‌ యాక్ట్రెస్‌. కాగా గతేడాది డిసెంబరులో సందీప్‌ అనే వ్యక్తితో మౌనిక పెళ్లి పీటలెక్కింది. దీంతో అప్పటి నుంచి సిల్వర్‌ స్క్రీన్‌పై కనిపించలేదీ అందాల తార. అయితే ఇప్పుడు మరో ఆసక్తికర వెబ్‌ సిరీస్‌తో మన ముందుకు రానుంది మౌనికా రెడ్డి. ‘మిస్టర్‌ నాగ‌భూష‌ణం’ పేరుతో తెరకెక్కిన ఓ ఫన్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనింగ్‌ వెబ్‌ సిరీస్‌లో మౌనిక కీ రోల్‌ పోషించింది. ఇందులో మ్యాడ్ సినిమా హీరో రామ్‌ నితిన్‌ మరో కీ రోల్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ ఫన్‌ ఫ్యామిలీ వెబ్‌ సిరీస్‌ అక్టోబర్‌ 13 నుంచి స్ట్రీమింగ్ కు రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ల ఈటీవీ విన్‌లో మిస్టర్‌ నాగ భూషణం సిరీస్‌ అందుబాటులోకి రానుంది. తాజాగా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రిలీజ్‌ చేశారు మేకర్స్‌.
ఓ జంట ప్రేమ‌, పెళ్లి క‌థ నేప‌థ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌కు దిలీప్ స‌ర‌స్వతి ద‌ర్శకత్వం వ‌హించారు. హారిక కొణిదెల‌తో సూర్యకాంతం, ముద్దపప్పు ఆవ‌కాయ‌, నాన్నకూచి వంటి సూపర్‌ హిట్‌ సిరీస్‌ల‌ను తెర‌కెక్కించిన ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

భాగ్ సాలే దర్శకుడి ఓటీటీ ఎంట్రీ..

ఇవి కూడా చదవండి

ఇక దర్శకుడు ప్రణీత్‌ విషయానికొస్తే.. కీరవాణి తనయుడు శ్రీ సింహా హీరోగా భాగ్‌సాలే అనే సినిమాను తెరకెక్కించాడు. యూత్ ఫుల్‌ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ మూవీ పర్వాలేదనిపించింది. ఇప్పుడు మిస్టర్‌ నాగ భూషణంతో ఓటీటీలో తన అదృష్టం పరీక్షించుకుంటున్నాడు. ఈ వెబ్‌ సిరీస్‌లో రామ్ నితిన్‌, మౌనికా రెడ్డిలతో పాటు బిందు చంద్రమౌళి, హర్ష వర్ధన్‌ తదితరులు కీల‌క పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ రిలీజ్‌ కానుంది.

 

అక్టోబర్ 13 నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్..

మౌనికా రెడ్డి లేటెస్ట్ ఇన్ స్టాగ్రామ్ ఫొటోస్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.