Mathu Vadalara 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘మత్తు వదలరా 2’.. స్ట్రీమింగ్ అప్పుడేనా.. ?

|

Oct 02, 2024 | 5:16 PM

అంతేకాకుండా ఈ మూవీ ట్రైలర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేయడం.. ప్రమోషన్లలో రాజమౌళి సందడి చేయడంతో రిలీజ్ కు ముందే ఈ చిత్రంపై క్యూరియాసిటి నెలకొంది. తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అలాగే నిర్మాతల అంచనాలకు తగ్గట్లుగా వసూళ్లు రాబట్టింది.

Mathu Vadalara 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తోన్న మత్తు వదలరా 2.. స్ట్రీమింగ్ అప్పుడేనా.. ?
Mathu Vadalara 2
Follow us on

ఇటీవల తెలుగు సినీరంగంలో విడుదలైన సూపర్ హిట్ చిత్రాల్లో ‘మత్తు వదలరా 2’ ఒకటి. సెప్టెంబర్ 13న రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమాకు బాక్సాఫీస్ వద్ద సకెస్స్ సాధించింది. ఈ క్రైమ్ కామెడీ మూవీలో నటుడు శ్రీసింహా, సత్య ప్రధాన పాత్రలలో నటించారు. గతంలో దాదాపు ఐదేళ్ల క్రితం వచ్చిన మత్తు వదలరా సినిమాకు సీక్వెల్ ఇది. విడుదలకు ముందే ఈ మూవీ పై మంచి బజ్ నెలకొంది. అంతేకాకుండా ఈ మూవీ ట్రైలర్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రిలీజ్ చేయడం.. ప్రమోషన్లలో రాజమౌళి సందడి చేయడంతో రిలీజ్ కు ముందే ఈ చిత్రంపై క్యూరియాసిటి నెలకొంది. తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అలాగే నిర్మాతల అంచనాలకు తగ్గట్లుగా వసూళ్లు రాబట్టింది.

ఇక ఇన్నాళ్లు థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమయ్యింది. అడియన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఈ క్రైమ్ కామెడీ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం అక్టోబర్ 11 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల తర్వాత ఈ మూవీ ఓటీటీలోకి వస్తుంది. అలాగే దసరా పండగ సందర్భంగా వస్తుండడంతో ఈ చిత్రానికి ఓటీటీలోనూ అత్యధిక వ్యూస్ రానున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

డైరెక్టర్ రితేశ్ రాణా దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సత్య, శ్రీసింహా యాక్టింగ్ పై ప్రశంసలు దక్కాయి. కామెడీ టైమింగ్ తో ఇద్దరూ అదరగొట్టారు. ఇక ఇందులో ఫరియా అబ్దుల్లా, వెన్నెల కిశోర్, సునీల్, రోహిణ్, అజయ్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రం దాదాపు రూ.32 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.