షణ్ముఖ్ జస్వంత్.. ఒకప్పుడు యూట్యూబ్ స్టార్. షార్ట్ ఫిల్మ్, వెబ్ సిరీస్ ద్వారా భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. అటు సోషల్ మీడియాలో షన్నూ సూపర్ స్టార్. అప్పట్లో షణ్ముఖ్ చేసే షార్ట్ ఫిల్మ్ మిలియన్ వ్యూస్ అందుకుంటూ రికార్డ్స్ క్రియేట్ చేశాయి. కానీ కొన్నాళ్లుగా షణ్ముఖ్ షార్ట్ ఫిల్మ్స్, వెబ్ సిరీస్ రావడం లేదు. పర్సనల్ విషయాలతో నిత్యం వార్తలలో నిలిచిన షన్నూ.. చాలా కాలంగా అడియన్స్ ముందుకు రాలేదు. బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న షన్నూ.. ఆ తర్వాత నెమ్మదిగా గ్రాఫ్ పడిపోయింది. అలాగే కొన్ని వివాదాల్లోనూ చిక్కుకున్నాడు. ప్రస్తుతం అతడు ప్రధాన పాత్రలో ‘లీలా వినోదం’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. పవన్ సుంకర దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో అనఘా అజిత్ కథానాయికగా నటిస్తుంది. మధన్ మోహన్, శివ తుమ్ముల కీరోల్స్ చేస్తున్నారు.
సెప్టెంబర్ 16న షణ్ముఖ్ జస్వంత్ పుట్టినరోజు సందర్భంగా లీలా వినోదం నుంచి టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో షన్నూ పాత్రను పరిచయం చేస్తూ వీడియో స్టా్ర్ట్ అయ్యింది. ఓ బ్లాక్ బోర్టుపై షణ్ముఖ్ రాతలు రాస్తుండగా.. “ఈ కథ నా బెస్ట్ ఫ్రెండ్ పీఎంఆర్కేవీ ప్రసాద్ గాడిది.. రేయ్” అని వాయిస్ ఓవర్ వస్తుంది. ఆ తర్వాత షణ్ముఖ్ తిరిగి చూస్తాడు. నలుగురు స్నేహితుల మధ్య ఈ స్టోరీ సాగుతుందని టీజర్ చూస్తే అర్థమవుతుంది. మూడేళ్లగా లీలా కుమారితో ప్రేమలో ఉంటాడు షణ్ముఖ్. తాజాగా విడుదలైన టీజర్ ఆకట్టుకుంటుంది.
లీలా వినోదం సిరీస్ నవంబర్ నెలలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈటీవీ విన్ లో దూసుకుపోతుంది కమిటీ కుర్రోళ్లు. ఈ రూరల్ కామెడీ సినిమా సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. యధు వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మించింది.
ఇది మా ప్రసాద్ గాడి కథ..
కాదు కాదు ప్రసాద్ గాడి వీరాప్రేమ కథ 😅A Win Orginal Film#LeelaVinodam 😍
An @etvwin Original coming to entertain you at your homes from November 🤩 #shannu #EtvWin #WinThoWinodam #WinOriginals pic.twitter.com/BkD8K40aJ9— ETV Win (@etvwin) September 16, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.