Kinnerasani: నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న కళ్యాణ్ దేవ్ సినిమా.. కిన్నెరసాని స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

|

Jun 05, 2022 | 12:03 PM

రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో అన్ శీతల్, కాశిష్ ఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ రమణ తేజ దర్శకత్వం వహిస్తుండగా..

Kinnerasani: నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తున్న కళ్యాణ్ దేవ్ సినిమా.. కిన్నెరసాని స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
Kinnerasani
Follow us on

విజేత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయమయ్యాడు హీరో కళ్యాణ్ దేవ్. ఇటీవల సూపర్ మచ్చి సినిమాతో ఆడియన్స్ ముందుకు రాగా.. ఆశిచినంతస్థాయిలో ఆ చిత్రం ఆకట్టుకోలేకపోయింది. తాజాగా ఈ హీరో ప్రధాన పాత్రలో నటిస్తోన్న లేటేస్ట్ చిత్రం కిన్నెరసాని. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాలో అన్ శీతల్, కాశిష్ ఖాన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి డైరెక్టర్ రమణ తేజ దర్శకత్వం వహిస్తుండగా.. SRT ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ ప్రసాద్ తళ్లూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాను జనవరి 26న థియేటర్లలో విడుదల చేయాలనుకున్నారు. కానీ అనివార్య కారణాల వలన సినిమా విడుదల వాయిదా పడింది. తాజాగా ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లుగా ప్రకటించారు మేకర్స్.

సెన్సేషనల్ సినిమాలతో రోజురోజుకీ తన స్థాయి పెంచుకుంటుంది జీ 5 సంస్థ. ఇప్పటికే ఒరిజినల్ వెబ్ సిరీస్‌లతో పాటు ఆసక్తికరమైన సినిమాలను నేరుగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది జీ5. తాజాగా మరో ఆసక్తికరమైన చిత్రాన్ని ఎక్స్‌క్లూజివ్‌గా జీ 5లో విడుదల చేయనున్నారు. కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన కిన్నెరసాని సినిమా హక్కులను జీ 5 సొంతం చేసుకున్నారు. జూన్ 10న ఈ సినిమాను నేరుగా ఓటిటిలో విడుదల చేయనున్నారు. మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన కిన్నెరసాని జీ5లో నేరుగా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. వేద అనే అమ్మాయి.. తన తండ్రి కోసం వెతకడం చుట్టూనే ఈ సినిమా కథ అంతా తిరుగుతుంది. అన్ శీతల్, కాశిష్ ఖాన్ హీరోయిన్లుగా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో రవీంద్ర విజయ్ విలన్‌గా నటించారు. మరో కీలక పాత్రలో మహతి బిక్షు నటించారు. రమణ తేజ ఈ థ్రిల్లర్‌ను ఆసక్తికరంగా తెరకెక్కించారు. సాయి తేజ దేహరాజ్ ఆత్రేయ ఈ సినిమాకు కథ అందించారు. ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను మెప్పిస్తుందని మేకర్స్ బలంగా చెప్తున్నారు.