యాక్షన్ సీక్వెన్స్‌లో బిజీగా మారిన సూపర్ స్టార్‌ మహేశ్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో..

|

Feb 04, 2021 | 12:28 PM

Sarkaru Vaari Paata: టాలీవుడ్‌లో సూపరస్టార్ మహేశ్‌బాబుకున్న క్రేజే వేరు. చేసినవి తక్కువ సినిమాలైనా పాపులారిటీ మామూలుగా ఉండదు.

యాక్షన్ సీక్వెన్స్‌లో బిజీగా మారిన సూపర్ స్టార్‌ మహేశ్.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటో..
Follow us on

Sarkaru Vaari Paata: టాలీవుడ్‌లో సూపరస్టార్ మహేశ్‌బాబుకున్న క్రేజే వేరు. చేసినవి తక్కువ సినిమాలైనా పాపులారిటీ మామూలుగా ఉండదు. చేసే ప్రతి సినిమాలో వెరైటీ పాత్రలను పోషిస్తూ తనదైన శైలిలో అభిమానులను అలరిస్తాడు. తాజాగా దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా మహానటి ఫేం కీర్తి సురేశ్ నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్‌లో జరుగుతుంది.

దుబాయిలో కీర్తి , మహేష్ మధ్య రొమాంటిక్ ట్రాక్స్ మాత్రమే కాకుండా అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ కూడా తీస్తున్నారని టాక్ వచ్చింది. మరి అందుకు తగ్గట్టుగానే లేటెస్ట్ గా బయటకొచ్చిన ఆన్ లొకేషన్ స్టిల్ చూస్తే ఆహా అనిపిస్తుంది. ఎర్రటి ఎండలో మహేష్ వెనుక దర్శకుడు ఇతర చిత్ర యూనిట్ కనిపిస్తున్నారు. మరి అలాగే దానితో పాటుగా బ్యాక్‌గ్రౌండ్‌లో కొన్ని కార్లు కూడా కనిపిస్తున్నాయి. మరి ఇవన్నీ చూస్తుంటే ఒక అదిరే కార్ ఛేజింగ్ యాక్షన్ సీక్వెన్స్ ఏమో అనిపిస్తుంది. మరి అదా కాదా అన్నది తెలియాలంటే ఇంకొన్నాళ్ళు వేచిచూడక తప్పదు. ప్రస్తుతానికి అయితే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది.

‘సర్కారు వారి పాట’ కోసం హైదరాబాద్‌లో భారీ సెట్ .. జనవరి నుంచి ఏకధాటిగా షూటింగ్