సుశాంత్‌ ఆత్మహత్య కేసు: మహేష్‌ భట్ పోలీసులకు ఏం చెప్పారంటే

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో ముంబయి పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ కుటుంబ సభ్యులతో పాటు అతడి సన్నిహితులు, పలువురు బాలీవుడ్ ప్రముఖులను విచారించారు పోలీసులు.

సుశాంత్‌ ఆత్మహత్య కేసు: మహేష్‌ భట్ పోలీసులకు ఏం చెప్పారంటే
Follow us

| Edited By:

Updated on: Jul 28, 2020 | 11:49 AM

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో ముంబయి పోలీసుల విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే సుశాంత్ కుటుంబ సభ్యులతో పాటు అతడి సన్నిహితులు, పలువురు బాలీవుడ్ ప్రముఖులను విచారించారు పోలీసులు. ఇక తాజాగా ప్రముఖ దర్శకనిర్మాత మహేష్‌ భట్‌ స్టేట్‌మెంట్‌ని రికార్డు చేశారు ముంబయి పోలీసులు. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, ప్లాన్ ప్రకారం హత్య చేశారని అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్న క్రమంలో మహేష్‌ భట్‌ని విచారించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఇక విచారణలో భాగంగా సుశాంత్‌ని తాను రెండుసార్లు మాత్రమే కలిశానని మహేష్‌ భట్‌ పోలీసులకు తెలిపినట్లు తెలుస్తోంది. 2018 నవంబర్‌లో ఓ సారి, 2019 జనవరిలో మరోసారి సుశాంత్‌ని కలిశానని అప్పుడు సినిమాల గురించి తాము ఏం మాట్లాడలేదని చెప్పినట్లు సమాచారం. ఇక సడక్‌ 2లో మొదట సుశాంత్‌కి ఆఫర్‌ ఇచ్చి తరువాత ఆదిత్య రాయ్‌ కపూర్‌ని తీసుకున్నట్లు అప్పట్లో పుకార్లు రాగా.. దానిపై స్పందించిన మహేష్‌, అందులో నిజం లేదని చెప్పినట్లు తెలుస్తోంది.

అంతేకాదు తన ఏ చిత్రం కోసం సుశాంత్‌ని తీసుకునే ఉద్దేశ్యం లేదని అందుకే ఏ మూవీ కోసం అతడిని సంప్రదించలేదని మహేష్‌ చెప్పినట్లుగా సమాచారం. అయితే తన సినిమాలో చిన్న పాత్ర ఇచ్చినా చేస్తానని సుశాంత్ చాలా సార్లు తనను అడిగారని ఈ దర్శకుడు చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇక సుశాంత్ గర్ల్‌ఫ్రెండ్ రియా 2018లో తన చిత్రం జాలేబీలో నటించిందని, అప్పటి నుంచి తనను మెంటర్‌గా భావిస్తోందని ఈ దర్శకుడు పోలీసులకు చెప్పినట్లుగా సమాచారం. కాగా ఈ కేసులో కరణ్ జోహార్‌ని కూడా పోలీసులు విచారించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే కంగనాకు ఇప్పటికే నోటీసులు పంపగా.. త్వరలోనే ఆమె స్టేట్‌మెంట్‌ని రికార్డు చేయనున్నారు ముంబయి పోలీసులు.

Read This Story Also: ‘మర్డర్’ ట్రైలర్‌ విడుదల.. వర్మ సంధించిన ప్రశ్నలేంటంటే