దుబాయ్ షార్జా మెలిహా చారిత్రక ఎడారిలో ‘సర్కార్ వారి పాట’ టీం.. ఫోటోలను షేర్ చేసిన మహేష్..

|

Feb 05, 2021 | 5:21 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం "సర్కారు వారి పాట" మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ దుబాయ్‏లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. 

దుబాయ్ షార్జా మెలిహా చారిత్రక ఎడారిలో సర్కార్ వారి పాట టీం.. ఫోటోలను షేర్ చేసిన మహేష్..
Follow us on

Sarkaru Vari Pata Movie Update: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం “సర్కారు వారి పాట” మూవీ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ దుబాయ్‏లో ప్రారంభమైన సంగతి తెలిసిందే.  ఇందులో మహేష్ బాబుకు జోడీగా కీర్తి సురేషన్ నటిస్తుంది. దుబాయ్ లో ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరగుతుంది. ఈ మూవీకి పరశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‏గా మహేష్.. తాజాగా దుబాయ్‏లోని షార్జా మెహాలీ ఎడారిలో ఉన్న ఫోటోలను షేర్ చేశాడు.

“షార్జాకు సమీపంలో ఉన్న మెలిహా ఎడారిలో సర్కారు వారి పాట షూటింగ్ జరగడం అద్బుతమైన అనుభూతిని కలిగిస్తోంది. ఈ ప్రాంతానికి సంబంధించిన కథలు, అద్బుతమైన లొకేషన్లు చాలా బాగా నచ్చాయి”.. అంటూ మహేష్ ట్వీట్ చేశాడు. అదే ఎడారిలో ప్రత్యేకంగా ఓ గెస్ట్ హౌస్ కూడా నిర్మించినట్లు ఫోటోలు చూస్తుంటే తెలుస్తుంది. ప్రస్తుతం మహేష్ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి సర్కారు వారి పాట సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read:

‘మోసగాళ్ళు’ నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్.. డబ్బు సంపాదించాలంటే రైటు, రాంగు డిస్కషన్ వద్దంటున్నా మంచు విష్ణు..