
అక్కినేని నాగార్జున మరో ప్రాజెక్టును మంగళవారం ప్రారంభించారు. PSV గరుడవేగ ఫేం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో కింగ్ నాగ్ ఓ సినిమా చేయబోతున్నారనే సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని సోనాలి నారంగ్ సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ మరియు నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లి బ్యానర్లపై నారాయణ దాస్ కె నాంరగ్, రామ్మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాని మంగళవారం సికింద్రాబాద్లోని గణపతి దేవాలయంలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ మూవీ ముహూర్తపు సన్నివేశానికి తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ క్లాప్ ఇచ్చి యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇదిలా ఉండగా.. లాక్డౌన్ తర్వాత నాగ్ స్పీడ్ పెంచారు. గతేడాది ప్రారంభమై.. కరోనా ప్రభావంతో వాయిదా పడిన సినిమా షూటింగ్ను వెంట వెంటనే పూర్తిచేశారు. అందులో వైల్డ్ డాగ్, బ్రహ్మస్త సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ఈ మూవీలో నాగార్జునను సరికొత్త యాంగిల్లో చూపించేందుకు ప్రవీణ్ సత్తారు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో నాగార్జున ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్ టైనర్లో నటించనున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “నిన్ననే బ్రహ్మాస్త్ర మూవీ షూటింగ్ పూర్తిచేసుకున్నాను. ఈరోజు శ్రీగణపతి దేవాలయంలో సినిమా ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఇంకా టైటిల్ ఫైనలైజ్ కాలేదు. యాక్షన్ బ్యాక్డ్రాప్లో ఇలాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్లో నటించి చాలా రోజులైంది. హైదరాబాద్తోపాటు విదేశాల్లో కూడా ఈ మూవీ షూటింగ్ జరగునుంది” అని తెలిపారు.
Production No-3 Launched Formally Today..Bringing King @iamnagarjuna Back to action..
Directed by – #PraveenSattaru
Produced by – @SVCLLP & @nseplofficial @sharrath_marar @AsianSuniel #PushkarRamMRao #NarayandasKNarang pic.twitter.com/v66WBaoXBv— BARaju (@baraju_SuperHit) February 16, 2021
Also Read: