Karthika Deepam : కార్తీక దీపంలో తల్లికొడుకులైన కార్తీక్, సౌందర్యల మధ్య నిజజీవితంలో వయసు బేధం తెలిస్తే షాక్..!

|

Feb 27, 2021 | 10:08 PM

బుల్లి తెరపై గత మూడేళ్లకు పైగా నెంబర్ ప్లేస్ లో కొనసాగుతోంది కార్తీక దీపం సీరియల్. దేశ విదేశాల్లో తెలుగులోగిళ్ళలో కార్తీక దీపం ఫ్యాన్ లేనివాళ్లు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.. ఇక సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ సాయంత్రం 7.30 గంటలు అవుతుందంటే చాలు టివి స్క్రీన్స్ ముందు చేరుకుంటారు ...

Karthika Deepam : కార్తీక దీపంలో తల్లికొడుకులైన కార్తీక్, సౌందర్యల మధ్య నిజజీవితంలో వయసు బేధం తెలిస్తే షాక్..!
Follow us on

Karthika Deepam : బుల్లి తెరపై గత మూడేళ్లకు పైగా నెంబర్ ప్లేస్ లో కొనసాగుతోంది కార్తీక దీపం సీరియల్. దేశ విదేశాల్లో తెలుగులోగిళ్ళలో కార్తీక దీపం ఫ్యాన్ లేనివాళ్లు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.. ఇక సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ సాయంత్రం 7.30 గంటలు అవుతుందంటే చాలు టివి స్క్రీన్స్ ముందు చేరుకుంటారు.. అంతగా ఆకట్టుకుంది ఈ సీరియల్. ఈ ధారావాహిక లో ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కార్తీక్, దీప, సౌందర్య , మౌనిత నుంచి పనిమనిషి ప్రియమణి వరకూ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అయితే హీరో కార్తీక్ కు తల్లిగా నటిస్తున్న సౌందర్య స్వతహాగా కన్నడ.. అయినా తన నటనతో తెలుగింటి ఆడబడులా ఆదరణ సొంతం చేసుకుంది.

సౌందర్య పాత్రలో జీవిస్తున్న అర్చన ఓ వైపు కొడుకుపై ప్రేమ చూపిస్తూ.. అతను చేస్తోన్న తప్పును ఎత్తిచూపుతూ.. కోడలు దీపకు అండగా ఉండే సౌందర్యకు ఓ రేంజ్ లో ఫ్యాన్ పాలోయింగ్ సొంతం చేసుకుంది. బుల్లి తెరపై అందమైన రూపంతో పాటు మంచి మనసున్న అత్తగా ఆకట్టుకుంటుంది. అయితే ఇందులో తల్లి కొడుకులుగా నటిస్తున్న నిరుపమ్ కు అర్చనా కు నిజజీవితంలో వయసు తేడా తెలిస్తే షాక్ తింటారు.

కర్ణాటకలో పుట్టిన పెరిగిన అర్చనా సీరియల్స్ లో నటిగా అడుగు పెట్టక ముందు.. బ్యూటీషియన్ గా పనిచేశారు అర్చ‌నా అనంత్క. ఒక వ్యాపార వేత్తను పెళ్లి చేసుకున్న అర్చన కు ఒక బాబు కూడా ఉన్నారు. ‌1988 జ‌న‌వ‌రి 3న‌ జ‌న్మించిన అర్చ‌నా వ‌య‌స్సు ప్ర‌స్తుతం 33 ఏళ్లు.

ఇక టాలీవుడ్‌ నటుడు, నిర్మాత, కథారచయిత ఓంకార్ కుమారుడు ప‌రిటాల నిరుప‌మ్. నిరుపమ్ కూడా 1988లో ఫిబ్ర‌వ‌రి 15న జ‌న్మించారు. త‌న స‌హ న‌టి మంజుల‌ను నిరుప‌మ్ వివాహం చేసుకోగా.. వీరిద్ద‌రికి ఒక బాబు ఉన్నాడు.

అయితే కార్తీక దీపం సీరియ‌ల్‌లో తల్లీకొడుకులుగా న‌టిస్తున్న‌ప్ప‌టికీ.. నిజ జీవితంలో కార్తీక్, సౌంద‌ర్య‌ల మ‌ధ్య వ‌య‌సు వ్యత్యాసం 43 రోజులు మాత్ర‌మే. అయిన‌ప్ప‌టికీ.. వ‌య‌సు మించిన పాత్ర‌లో కార్తీక్‌కి త‌ల్లిగా సౌంద‌ర్య  ఓ రేంజ్ లో నటిస్తూ.. తల్లి అంటే ఇలా ఉండాలి అనిపిస్తున్నారు. కాగా ఇన్ని రోజులు బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను అల‌రించిన అర్చ‌నా.. ఇప్పుడు టాలీవుడ్ లో అడుగు పెట్టడానికి రెడీ అవుతున్నారు. అన‌సూయ న‌టించిన థ్యాంక్యు బ్ర‌ద‌ర్‌లో మూవీలో అర్చ‌నా కీల‌క పాత్ర‌లో నటిస్తున్నారు.

Also Read:

సౌందర్యతో పెళ్లిని రిజెక్ట్ చేశా… అంటున్న మల్టీటాలెంటెడ్ పర్సన్ ఎవరో తెలుసా..!

ఐటీ నిపుణులకు గుడ్ న్యూస్ చెప్పిన ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ.. ఈ ఏడాదిలో భారీ నియామకాలు