
మలయాళీ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఈ హీరోకు తెలుగుతోపాటు తమిళంలోనూ మంచి క్రేజ్ ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన సలార్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తర్వాత ఆడుకాలం సినిమాతో మరోసారితో అడియన్స్ ముందుకు వచ్చారు. ఇప్పుడు పాన్ వరల్డ్ మోస్ట్ అవైటెడ్ సినిమా వారణాసి చిత్రంలో కుంభ అనే విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఇటీవలే ఆయనకు సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇదెలా ఉంటే.. ఇప్పుడు పృథ్వీరాజ్ పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడానికి జనాలు తెగ ఆసక్తి చూపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Actress : కోట్లలో అప్పులు.. తినడానికి తిండి లేక తిప్పలు.. ఇప్పుడు వందల కోట్లకు మహారాణి ఈ బిగ్ బాస్ బ్యూటీ..
పృథ్వీరాజ్ భార్య సుప్రియా మీనన్ ఒకప్పుడు టాప్ జర్నలిస్ట్. కానీ పెళ్లి తర్వాత నిర్మాతగా మారి సినీరంగంలో సక్సెస్ అయ్యారు. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పృథ్వీరాజ్ తో ప్రేమలో పడిన ఆమె.. తన జాబ్ సైతం వదిలేసింది. ఆ తర్వాత భర్తకు తోడుగా ఉంటూ ఇటు నిర్మాణరంగంలోకి అడుగుపెట్టింది. బీబీసీ జర్నలిస్ట్ గా పనిచేసిన సుప్రియా.. ముంబైలో పలు నేషనల్ ఛానల్స్ లో బిజినెస్ రిపోర్టర్ గా పనిచేసింది. అయితే సుప్రియ జర్నలిస్ట్ గా ఉన్నప్పుడు మలయాళీ సినిమా గురించి ఓ స్టోరీ రాయాల్సి వచ్చింది. ఆ ఇండస్ట్రీ గురించి అంతగా ఐడియా లేకపోవడంతో తన సహుద్యోగి సాయం తీసుకుంది. అదే సమయంలో పృథ్వీరాజ్ నంబర్ తీసుకుని అతడికి కాల్ చేసి సినిమా గురించి తెలుసుకుందట.
ఇవి కూడా చదవండి : Suryavamsham : హీరోగా సూర్యవంశం సినిమా చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూశారా.. ?
ఆ తర్వాత స్నేహితులుగా మారిన.. ఆ స్నేహం చివరకు ప్రేమగా మారింది. కొన్నాళ్లపాటు ప్రేమలో ఉన్న వీరిద్దరు 2011 ఏప్రిల్ 25న పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత జర్నలిజం ఉద్యోగాన్ని వదిలి కుటుంబానికి తన టైమ్ కేటాయించింది. ఆ తర్వాత నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి నిర్మాతగా సక్సెస్ అయ్యింది.
ఇవి కూడా చదవండి : Cinema : రూ.32 కోట్లు పెట్టి తీస్తే రూ.440 కోట్ల కలెక్షన్స్.. ఆరేళ్లుగా సంచలనం.. ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్..
ఇవి కూడా చదవండి : Actress : తెలుగులో తోపు హీరోయిన్.. ఇప్పుడు బడా నిర్మాత.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో బ్లాక్ బస్టర్ హిట్స్..