AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manasantha Nuvve : ఆ పాటలు చూశాక మనసంతా నువ్వే సినిమాకు ఆమె వద్దు అనుకున్నా.. కానీ.. డైరెక్టర్..

మనసంతా నువ్వే చిత్రంలో రీమా సేన్ గ్లామరస్‌గా కాకుండా పక్కింటి అమ్మాయి పాత్రకు ఎంపికవ్వడంపై దర్శకుడు వి.ఎన్. ఆదిత్య ఆశ్చర్యకర విషయాలను వెల్లడించారు. ఎం.ఎస్. రాజుగారి నమ్మకంతో ఆమెను తీసుకున్నామని, క్లైమాక్స్ సన్నివేశంలో ఆమె నటన సినిమాకు ప్రాణం పోసిందని ఆయన తెలిపారు. తనికెళ్ళ భరణి విలనిజం, ఆర్.పి. పట్నాయక్ సంగీతం, సిరివెన్నెల సాహిత్యం గురించి కూడా వివరించారు.

Manasantha Nuvve : ఆ పాటలు చూశాక మనసంతా నువ్వే సినిమాకు ఆమె వద్దు అనుకున్నా.. కానీ.. డైరెక్టర్..
Manasantha Nuvve
Rajitha Chanti
|

Updated on: Aug 31, 2026 | 12:51 PM

Share

దర్శకుడు వి.ఎన్. ఆదిత్య ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన బ్లాక్‌బస్టర్ చిత్రం మనసంతా నువ్వే నిర్మాణం, నటీనటులు, సాంకేతిక నిపుణుల కృషి గురించి మాట్లాడారు. రీమా సేన్ ప్రధాన పాత్రలో నటించిన తీరు, తనికెళ్ళ భరణి విలనిజం, ఆర్.పి. పట్నాయక్ అందించిన సంగీతం, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం వంటి కీలక అంశాలపై ఆయన మాట్లాడారు. మనసంతా నువ్వే చిత్రంలో రీమా సేన్‌ను ఎంపిక చేయడం దర్శకుడు ఆదిత్యకు ఒక సవాలుగా నిలిచింది. అప్పటికే మనోహరా వంటి పాటలతో గ్లామరస్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న రీమా సేన్, మనసంతా నువ్వేలో పక్కింటి అమ్మాయిలా, ఎటువంటి గ్లామర్ కోణం లేకుండా, చుడీదార్లలో కనిపించాలి. “ఆ స్కిన్ షో లేదు. యంగ్ ఆడియన్స్ కి వాళ్ళని అట్ట్రాక్ట్ చేయడానికి రేమాసేన్ క్యారెక్టర్ నుంచి ఒక మనోహర లాంటి సూపర్ హిట్ సాంగ్ లేదు” అని ఆదిత్య అన్నారు. ఇది ప్రేక్షకుల నుండి నెగిటివ్ రెస్పాన్స్ తెస్తుందేమోనని, “మిస్ ఫైర్ కూడా అవ్వొచ్చు” అని ఆయన భయపడ్డారు. “ఎవరో కొత్త అమ్మాయి అయితే ఏం ఎక్స్పెక్టేషన్ ఉండదు. రేమాసేన్ అయితే ఉదయ్ కిరణ్ తోటి అలాంటి ఒక బెడ్ రూం సాంగో, ఏదో ఒక రొమాంటిక్ యాంగిల్ ఏదైనా ఉండాలని” ప్రేక్షకులు ఆశించవచ్చని భావించారు.

అయితే, నిర్మాత ఎం.ఎస్. రాజు రీమా సేన్, ఉదయ్ కిరణ్ ఎంపికపై పూర్తి నమ్మకంతో ఉన్నారు. రీమా సేన్ పాత్రను అద్భుతంగా పోషించిందని, తెలుగు అమ్మాయిలాగా సున్నితత్వాన్ని, ప్రేమను పండించిందని, ముఖ్యంగా ద్వితీయార్థంలో క్లైమాక్స్ హాస్పిటల్ సన్నివేశంలో ఆమె నటన సినిమాకు ప్రాణం పోసిందని ఆదిత్య ప్రశంసించారు. చిత్రంలో తనికెళ్ళ భరణి పోషించిన విలన్ పాత్రపై దర్శకుడు ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన విలనిజం ఒక “షాకింగ్ ఎలిమెంట్” అని, కోల్డ్ బ్లడెడ్ విలన్‌గా కనిపించినా, మంచి ప్రభుత్వ అధికారిలా కనిపించడం విశేషం అని అన్నారు. అప్పటివరకు ఆయన ఇలాంటి పాత్రలు చేయలేదని, ఆహుతి ప్రసాద్‌తో పోలిస్తే తనికెళ్ళ భరణిలో ఒక “ఎడ్జ్” ఉందని, ఆయన మంచివాడా, చెడ్డవాడా అనే సందేహాన్ని కలిగించే అవకాశం ఉందని ఆదిత్య అభిప్రాయపడ్డారు. క్లైమాక్స్ సన్నివేశంలో హీరోని పొడిచినప్పుడు ఆయన చూపిన ఆశ్చర్యం, కూతురి పట్ల తండ్రిగా ఆయన ప్రేమను చాటుతుందని, అది ఆయన పాత్రకు లోతును చేకూర్చిందని వివరించారు.

మనసంతా నువ్వే సినిమాకు సంగీతం ప్రాణం అని ఆదిత్య గట్టిగా చెప్పారు. ఆర్.పి. పట్నాయక్ సంగీతం లేనిదే సినిమా లేదని ఆయన అన్నారు. ఇటీవల రీ-రిలీజ్ సమయంలో పట్నాయక్ వెంటనే ఒక వీడియో చేసి పంపారని, డిజిటల్ ప్రమోషన్స్‌కు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. “నీ స్నేహం ఇక రాదు” అనే టైటిల్ సాంగ్ కేవలం రెండు లైన్ల పాట అయినా, సినిమా మొత్తం సోల్ ఆ నోట్స్‌లోనే ఉందని, ఇప్పటికీ ఆర్.పి. పట్నాయక్ స్టేజ్‌పై కనిపిస్తే ఆ పాట పాడించుకుని వినకుండా దిగనని ఆదిత్య తన అభిమానాన్ని చాటుకున్నారు. గొప్ప సాహిత్యం అందించిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గురించి మాట్లాడుతూ, ఆయన పనిపట్ల నిబద్ధతను ఆదిత్య వివరించారు. శాస్త్రి గారు నచ్చిన పాటలనే రాసేవారని, డబ్బుల కోసం తొందరపడి రాయరని అన్నారు. “కిటకిట తలుపులు” పాట రికార్డింగ్ సమయంలో చిత్ర గారు అమెరికా వెళ్లాల్సి ఉండగా, పల్లవి, చరణాలను ఆయన థియేటర్‌లోనే రాసి ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. “తూనీగా తూనీగా” పాట కోసం శాస్త్రి గారు 53 చరణాలు రాసి, తనకు నచ్చిన రెండు తీసుకోవాలని చెప్పారని ఆదిత్య తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా..

Follow Us