Rajamouli: పవన్‌, మహేష్‌, దిల్‌రాజుకు స్పెషల్‌ థ్యాంక్స్‌ చెప్పిన జక్కన్న.. ఎందుకో తెలుసా.?

| Edited By: Ravi Kiran

Dec 21, 2021 | 9:46 PM

Rajamouli: టాలీవుడ్‌ చరిత్రలో తొలిసారి అత్యంత భారీ బడ్జెట్‌ సినిమాలు ప్రేక్షకులకు ముందుకు రానున్నాయి. వీటిలో రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న ఆర్‌ఆర్‌ఆర్‌, ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన..

Rajamouli: పవన్‌, మహేష్‌, దిల్‌రాజుకు స్పెషల్‌ థ్యాంక్స్‌ చెప్పిన జక్కన్న.. ఎందుకో తెలుసా.?
Rajamouli
Follow us on

Rajamouli: టాలీవుడ్‌ చరిత్రలో తొలిసారి అత్యంత భారీ బడ్జెట్‌ సినిమాలు ప్రేక్షకులకు ముందుకు రానున్నాయి. వీటిలో రాజమౌళి దర్శకత్వంలో వస్తోన్న ఆర్‌ఆర్‌ఆర్‌, ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన రాధేశ్యామ్‌ చిత్రాలు సంక్రాంతి కానుకగా విడుదల కానున్నాయి. నిజానికి టాలీవుడ్‌కు ఎంతగానో అచ్చొచ్చిన సంక్రాంతికి ఈ రెండు చిత్రాలతో పాటు పవన్‌ హీరోగా తెరకెక్కిన భీమ్లా నాయక్‌, ఎఫ్‌3, మహేష్‌ బాబు హీరోగా తెరకెక్కిన ‘సర్కారు వారి పాట’ చిత్రాలు విడుదల కావాల్సి ఉంది.

అయితే తాజాగా రాధేశ్యామ్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రాల కోసం అన్ని సినిమాలు తమ విడుదల తేదీని వాయిదా వేసుకున్నాయి. ఈ క్రమంలో సర్కారు వారి పాట ఏప్రిల్‌ 1కి వాయిదా పడగా, ‘భీమ్లా నాయక్‌’ ఫిబ్రవరి 25కి, ‘ఎఫ్‌ 3’ చిత్రాలను ఏప్రిల్‌ 29కి వాయిదా వేశారు మేకర్స్‌. ఈ నిర్ణయంపై రాజమౌళి హర్షం వ్యక్తం చేశారు. ట్విట్టర్‌ వేదికగా వరుసగా ట్వీట్లు చేశారు. ‘భీమ్లా నాయక్‌ వాయిదా వేస్తూ చిన్నబాబు గారు, పవన్‌ కళ్యాణ్‌ గారు తీసుకున్న నిర్ణయం అభినందనీయం. భీమ్లా నాయక్‌ టీమ్‌కు ఆల్‌ ది బెస్ట్‌’ అంటూ ట్వీట్‌ చేశారు.

ఇక ఎఫ్‌3 సినిమాను వాయిదా వేసినందుకు గాను సినిమా నిర్మాత దిల్‌రాజుకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే సర్కారు వారి పాట వాయిదా వేయడంపై స్పందిస్తూ..’సర్కారు వారి పాట సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, ఆరోగ్యకరమైన వాతావరణం కోసం మహేష్‌ సినిమాను వాయిదా వేసుకున్నారు. నా హీరోకు ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చారు.

Also Read: Kim Jong Un: కాలకేయులను మించిపోయిన కిమ్.. ఆ వీడియోలు దొంగచాటుగా చూశారని ఏడుగురికి ఉరిశిక్ష!

Bheemla Nayak: పవన్ ఫ్యాన్స్ కు షాక్ !! పవన్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే ?? లైవ్ వీడియో

Baba Vanga: 2022 వంగబాబా భవిష్యవాణి ఏంటి ?? లైవ్ వీడియో