‘విక్రమ్‌ వేదా’ రీమేక్‌పై క్లారిటీ

|

Mar 22, 2019 | 7:02 PM

తమిళ్‌లో  సంచలన విజయం సాధించిన విక్రమ్‌ వేదా మూవీ తెలుగులో రీమేక్‌ అవుతుందంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. రకరకాల హీరోల పేర్లు కూడా ప్రచారం జరిగాయి. అయితే రీసెంట్‌ సినిమా రీమేక్ ఓకే అయినట్టు…అందులో బాలక‌ృష్ణ, రాజశేఖర్‌గా హీరోలుగా నటిస్తున్నారంటూ ప్రచారం హోరెత్తింది. తమిళ్‌లో మాదవన్‌, విజయ్‌ సేతుపతి హీరోలుగా నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ రీమేక్ రైట్స్ తీసుకుందంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఈ వార్తలపై విక్రమ్‌ వేదా […]

విక్రమ్‌ వేదా రీమేక్‌పై క్లారిటీ
Follow us on

తమిళ్‌లో  సంచలన విజయం సాధించిన విక్రమ్‌ వేదా మూవీ తెలుగులో రీమేక్‌ అవుతుందంటూ గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. రకరకాల హీరోల పేర్లు కూడా ప్రచారం జరిగాయి. అయితే రీసెంట్‌ సినిమా రీమేక్ ఓకే అయినట్టు…అందులో బాలక‌ృష్ణ, రాజశేఖర్‌గా హీరోలుగా నటిస్తున్నారంటూ ప్రచారం హోరెత్తింది. తమిళ్‌లో మాదవన్‌, విజయ్‌ సేతుపతి హీరోలుగా నటించిన ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ రీమేక్ రైట్స్ తీసుకుందంటూ వార్తలు ప్రచారంలోకి వచ్చాయి.

అయితే ఈ వార్తలపై విక్రమ్‌ వేదా నిర్మాణ సంస్థ వై నాట్ స్టూడియోస్‌ క్లారిటీ ఇచ్చింది. బాలయ్య, రాజశేఖర్‌ విక్రమ్‌ వేదా రీమేక్‌లో నటిస్తున్నట్టుగా వస్తున్న వార్తలన్నీ రూమర్స్ అని  కొట్టిపారేశారు. అంతేకాదు ఇప్పటి వరకు విక్రమ్‌ వేదా రీమేక్‌ రైట్స్‌ను ఎవరికీ ఇవ్వలేదన్న వై నాట్ స్టూడియోస్‌ ప్రతినిధులు, అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచి ఉండాలని సినీ అభిమానులను కోరారు.