Kangana Ranaut: ట్విట్టర్పై బాలీవుడ్ నటి కంగనా రౌత్ ప్రశంసలు.. అసలు కారణం ఏంటంటే..
ట్విట్టర్పై బాలీవుడ్ నటి కంగనా రౌత్ ప్రశంసలు కురిపించారు. అంతటితో ఆగకుండా.. ఇదొక్కటే ది బెస్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫాం.. అంటూ కితాబునిచ్చారు.
ట్విట్టర్పై బాలీవుడ్ నటి కంగనా రౌత్ ప్రశంసలు కురిపించారు. అంతటితో ఆగకుండా.. ఇదొక్కటే ది బెస్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫాం.. అంటూ కితాబునిచ్చారు. వివాదాస్పద వ్యాఖ్యలు రాయడంతో కంగనా రౌత్ ఖాతాపై ట్విట్టర్ యాజమాన్యం ఏడాది క్రితం నిషేధం విధించింది. కంగనా ట్విట్టర్ ఖాతా అందుబాటులోకి రాకపోవడంతో ఆమె తన అభిప్రాయాన్ని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. సుదీర్ఘంగా రాసిన పోస్ట్లో ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ తీసుకున్న నిర్ణయం సబబే అని సమర్ధించారు కూడా.
ట్విట్టర్లో బ్లూ టిక్లకు డబ్బు వసూలు చేయాలనే ఎలాన్ మస్క్ నిర్ణయాన్ని కంగనా రౌత్ సమర్థించింది. ‘బ్లూ టిక్ కోసం కొంత మొత్తంలో డబ్బు వసూలు చేయడం మంచి నిర్ణయం. ఈ నిర్ణయం ప్లాట్ఫాంను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ప్లాట్ఫాంలన్నీ ఉచితంగా సౌకర్యాలు కల్పిస్తే డబ్బు ఎలా వస్తుంది. ఇటువంటి పరిస్థితిలో బ్లూ టిక్స్ కోసం డబ్బు తీసుకోవాలనే మస్క్ నిర్ణయం ఖచ్చితంగా సరైనదే’ అని రాసింది.
నిరంతరాయంగా వివాదాస్పద ప్రకటనలు చేయడంతోపాటు ట్విట్టర్ నిబంధనలను ఉల్లంఘించారన్న కారణాలపై 2021 లో కంగనా రౌత్ ట్విట్టర్ ఖాతాపై యాజమాన్యం నిషేధం విధించింది. కాగా, ప్రస్తుతం ట్విట్టర్ బాధ్యతలను ఎలాన్ మస్క్ తీసుకున్నందున త్వరలోనే కంగనా ట్విట్టర్ ఖాతాపై నిషేధం తొలగిపోనున్నదని భావిస్తున్నారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..