Sankalp Reddy: బాలీవుడ్‌‌‌‌‌లోకి అడుగు పెడుతున్న మరో టాలీవుడ్ డైరెక్టర్..

బాలీవుడ్ లోకి తెలుగు డైరెక్టర్లు అడుగు పెట్టడం కొత్తేమి కాదు. ఇప్పటికే చాలా మంది మన దర్శకులు హిందీలో సత్తా చాటిన విషయం తెలిసిందే.

Sankalp Reddy: బాలీవుడ్‌‌‌‌‌లోకి అడుగు పెడుతున్న మరో టాలీవుడ్ డైరెక్టర్..
Sankalp Reddy

Edited By:

Updated on: Jul 20, 2021 | 8:29 AM

Sankalp Reddy: బాలీవుడ్ లోకి తెలుగు డైరెక్టర్లు అడుగు పెట్టడం కొత్తేమి కాదు. ఇప్పటికే చాలా మంది మన దర్శకులు హిందీలో సత్తా చాటిన విషయం తెలిసిందే. ఆర్జీవీతో మొదలు పెట్టుకొని సందీప్ రెడ్డి వంగ వరకు అందరు బాలీవుడ్ లో  విజయం సాధించారు. ఈ క్రమంలో మరో డైరెక్టర్ కూడా బాలీవుడ్ లోకి అడుగుపెట్టబోతున్నాడు. తెలుగులో ఘాజీ లాంటి విజయవంతమైన సినిమాను తెరకెక్కించిన సంకల్ప్ రెడ్డి రానా నటించిన ‘ఘాజీ ‘తోనే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు సంకల్ప్ రెడ్డి. ఇప్పుడు బాలీవుడ్ లో సినిమా చేసి విజయం సాధించాలని చూస్తున్నాడు సంకల్ప్. ఈ క్రమంలోనే  ‘జేబీ 71’ పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో విద్యుత్ జమాల్ హీరోగా నటిస్తున్నాడు. విద్యుత్ జమాల్  తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే గతంలో ఇతడు పలు సినిమాల్లో విలన్  గా నటించి మెప్పించాడు.

రానా నటించిన ‘ఘాజీ ‘ సినిమా తర్వాత సంకల్ప్ రెడ్డి మెగా హీరో వరుణ్ తేజ్ తో కలిసి అంతరిక్షం అనే సినిమా చేసాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. అంతరిక్షం సినిమా తర్వాత మరో సినిమా చేయలేదు సంకల్ప్. ఇప్పుడు సడన్ గా బాలీవుడ్ సినిమా తో తెరపైకి వచ్చాడు. బాలీవుడ్ రైటర్ ఆదిత్య శాస్త్రి అందించిన కథతో సంకల్ప్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడట. ఇండియా-పాకిస్థాన్ యుద్ధ నేపథ్యంలో సినిమా నడుస్తుందంటున్నారు. విద్యుత్ జమాల్ తన సొంత ప్రొడక్షన్లో ఈ సినిమాను నిర్మించబోతుండటం విశేషం.

మరిన్ని ఇక్కడ చదవండి :

Nidhi Agarwal: ఆ పాత్రకు అతను తప్ప మరెవరు న్యాయం చేయలేరు.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఇస్మార్ట్‌ బ్యూటీ.

Amala Paul: వైరల్ అవుతోన్న అమలాపాల్‌ లేటెస్ట్‌ ఫొటో షూట్‌.. అందంతో మతి పోగొడుతున్న అందాల ముద్దుగుమ్మ..

OTT: ఒటీటీ సూపర్‌హిట్.. 2 లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్న మార్కెట్..మరింత వేగంగా విస్తరణ!

Loading...
Unable to load recommendations.
Follow Us