శ్రీదేవి సంవత్సరీకం.. పాల్గొన్న అజిత్ ఫ్యామిలీ

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 2:18 PM

అతిలోక సుందరి శ్రీదేవి తొలి స్మారక దిన కార్యక్రమం చెన్నైలో జరిగింది. గతేడాది ఫిబ్రవరి 24న శ్రీదేవి దుబాయిలో మరణించగా.. మరో 10రోజులకు ఆమె మరణించి ఏడాది పూర్తి అవ్వనుంది. కానీ తిథి ప్రకారం ఈ నెల 14కు ఏడాది అవ్వగా.. ఆమె భర్త భోనీ కపూర్, మరిది అనిల్ కపూర్, కూతుళ్లు జాన్వీ, ఖుషీ చెన్నై చేరుకొని శ్రీదేవి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తమిళ నటుడు అజిత్, ఆయన భార్య శాలిని […]

శ్రీదేవి సంవత్సరీకం.. పాల్గొన్న అజిత్ ఫ్యామిలీ
Follow us on

అతిలోక సుందరి శ్రీదేవి తొలి స్మారక దిన కార్యక్రమం చెన్నైలో జరిగింది. గతేడాది ఫిబ్రవరి 24న శ్రీదేవి దుబాయిలో మరణించగా.. మరో 10రోజులకు ఆమె మరణించి ఏడాది పూర్తి అవ్వనుంది. కానీ తిథి ప్రకారం ఈ నెల 14కు ఏడాది అవ్వగా.. ఆమె భర్త భోనీ కపూర్, మరిది అనిల్ కపూర్, కూతుళ్లు జాన్వీ, ఖుషీ చెన్నై చేరుకొని శ్రీదేవి ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తమిళ నటుడు అజిత్, ఆయన భార్య శాలిని కూడా పాల్గొన్నారు.

కాగా అజిత్‌తో ఓ సినిమాను నిర్మించాలన్న శ్రీదేవి కోరికను బోని కపూర్‌ నెరవేర్చుతున్నాడు. బాలీవుడ్‌లో విజయం సాధించిన ‘పింక్‌’ను తమిళ్‌లో బోని కపూర్ రీమేక్ చేయనున్నాడు. ‘తీరన్ అదిగారథ్ ఒండ్రు’(తెలుగులో ఖాకీ) ఫేమ్ వినోత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుంది.