AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uttarakhand Elections: ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు పూర్తి.. 45 స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారు!

ఉత్తరాఖండ్‌ కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల పంపిణీ ప్రక్రియ చివరి దశలో ఉందని ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడు హరీశ్ రావత్ తెలిపారు.

Uttarakhand Elections: ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలపై కాంగ్రెస్ కసరత్తు పూర్తి.. 45 స్థానాలకు అభ్యర్థుల పేర్లు ఖరారు!
Uttarakhand Elections
Balaraju Goud
| Edited By: Team Veegam|

Updated on: Jan 20, 2022 | 8:33 PM

Share

Uttarakhand Assembly Elections 2022: ఉత్తరాఖండ్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది. రాష్ట్రంలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ 45 స్థానాలకు కాంగ్రెస్ త్వరలో టిక్కెట్లు ప్రకటించే అవకాశం ఉంది. జనవరి 15లోగా ఈ స్థానాలకు అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ ప్రకటించవచ్చని.. ఈ టికెట్లకు అంగీకారం కుదిరిందని కాంగ్రెస్ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడు హరీశ్ రావత్ తెలిపారు. అయితే, హరీష్ రావత్ ఎక్కడి నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారు? దీనిపై ఇంకా పార్టీ క్లారిటీ ఇవ్వలేదు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో హరీష్ రావత్ రెండు స్థానాల్లో పోటీ చేసి రెండు స్థానాల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

ఉత్తరాఖండ్‌ కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్ల పంపిణీ ప్రక్రియ చివరి దశలో ఉందని ఉత్తరాఖండ్ ఎన్నికల ప్రచార కమిటీ అధ్యక్షుడు హరీశ్ రావత్ తెలిపారు. రెండు రోజుల పాటు జరగనున్న రాష్ట్ర స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో 70 అసెంబ్లీ స్థానాలకు టికెట్ల కోసం వచ్చిన దరఖాస్తుల్లో ఏకాభిప్రాయానికి ప్రయత్నించినట్లు సమాచారం. అభ్యర్థుల ప్యానెల్‌ను సిద్ధం చేసే బాధ్యతను రాష్ట్ర ఎన్నికల కమిటీ స్క్రీనింగ్ కమిటీకి అప్పగించింది. అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయాన్ని కాంగ్రెస్ హైకమాండ్‌కు వదిలివేసింది. రాష్ట్రంలోని 70 అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్‌కు ఇప్పటి వరకు 478, షెడ్యూల్డ్ కులాల నుంచి 92, షెడ్యూల్డ్ తెగల నుంచి ఐదు దరఖాస్తులు వచ్చాయి. కాగా 78 మంది మహిళల్లో 15 మంది షెడ్యూల్డ్ కులాల మహిళలు దరఖాస్తు చేసుకున్నారు.

ఇటీవల, రాష్ట్రంలోని ప్రముఖ నాయకుల సమక్షంలో, ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థుల పేర్లను చర్చించింది. రెండు డజన్ల స్థానాలకు ముగ్గురు నుండి నలుగురు పోటీదారులతో ప్యానెల్ను సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉన్న తొమ్మిది మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఖాయమని, దీంతో పాటు గత ఎన్నికల్లో అతి తక్కువ ఓట్ల తేడాతో ఓడిపోయిన అభ్యర్థులకు కూడా టిక్కెట్లు ఇస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నెలాఖరులోగా రాష్ట్రంలోని మొత్తం 70 స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది.

అదే సమయంలో, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ తన ఎన్నికల్లో పోటీ చేసే విషయంపై ఏమీ వెల్లడించలేదు. జనవరి 3న ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ సమావేశం, జనవరి 9న కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరుగుతాయని తెలిపారు. తన ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

Read Also…  Jharkhand Accident: జార్ఖండ్‌లో ఘోర రోడ్డుప్రమాదం.. వ్యాన్‌ టక్కు ఢీకొని ఆరుగురు కూలీలు మృతి, 18 మందికి గాయాలు