AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

UP Elections 2022: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై పోటీ చేస్తానని ప్రకటించిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు జోరు పెంచాయి. ఇప్పటికే అన్ని పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. మొట్ట మొదటిసారిగా అసెంబ్లీ బరిలో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్.

UP Elections 2022: యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై పోటీ చేస్తానని ప్రకటించిన భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్
Up Polls
Follow us
Balaraju Goud

|

Updated on: Jan 20, 2022 | 9:43 PM

Uttar Pradesh Assembly Election 2022: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు జోరు పెంచాయి. ఇప్పటికే అన్ని పార్టీలు తమ తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. మొట్ట మొదటిసారిగా అసెంబ్లీ బరిలో పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్(Yogi Adityanath). గోరఖ్‌పూర్ సదర్(Gorakhpur) స్థానం నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే ఆయనకు వ్యతిరేకంగా భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్(Chandrashekhar Azad) గళం విప్పారు. వచ్చే ఎన్నికల్లో యోగిపై పోటీ చేసేందుకు సమర శంఖం పూరించారు.

యోగి ఆదిత్యనాథ్ కూడా తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. 2017లో ముఖ్యమంత్రి అయ్యే వరకు లోక్‌సభ సభ్యుడిగా ఉన్నారు. యోగి తొలిసారిగా 1998లో గోరఖ్‌పూర్ నుంచి లోక్‌సభ ఎంపీగా ఎన్నికయ్యారు. గోరఖ్‌పూర్ నుంచి వరుసగా 5 సార్లు లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసనమండలి ద్వారా ఎమ్మెల్సీగా ఎంచుకున్నారు.

ప్రగతిశీల సమాజ్‌వాదీ పార్టీ (పీఆర్‌ఎస్‌పీ) జాతీయ అధ్యక్షుడు శివపాల్‌ సింగ్‌ యాదవ్‌, సుహెల్‌దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీ అధినేత ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌, రాష్ట్రీయ లోక్‌దళ్‌ అధినేత జయంత్‌ సహా కొంతమంది వ్యక్తులపై తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టబోదని ఆజాద్‌ చెప్పారు. సమాజ్‌వాదీ అధ్యక్షులు అఖిలేష్ యాదవ్ ఎన్నికల్లో పోటీ చేస్తే పార్టీ తన ముందు అభ్యర్థిని నిలబెట్టదని ఆయన అన్నారు.

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ 100 సీట్లు ఇచ్చినా, దానితో పొత్తు పెట్టుకోబోమని ఆజాద్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆజాద్ స్పష్టం చేశారు. ఉత్తరప్రదేశ్‌లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని, సమాజ్‌వాదీ పార్టీతో చర్చలు ఫలించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆజాద్ సమాజ్ పార్టీ అధినేత చంద్రశేఖర్ ఆజాద్ గ్రేటర్ నోయిడాలో విలేకరుల సమావేశంలో తెలిపారు.

Read Also…. Republic Day 2022: గణతంత్ర వేడుకలకు ముస్తాబైన దేశ రాజధాని.. మంచు దుప్పటిలో కొనసాగుతున్న పరేడ్‌ రిహార్సల్స్‌..దృశ్యాలు

అలరిస్తున్న #సింగల్ ట్రైలర్.. ప్రమోషన్‌ స్పీడు పెంచిన కింగ్‌డమ్..
అలరిస్తున్న #సింగల్ ట్రైలర్.. ప్రమోషన్‌ స్పీడు పెంచిన కింగ్‌డమ్..
బంగారం ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. గోల్డ్‌ ధర ఎంత పెరిగిందో తెలుసా
బంగారం ప్రియులకు బ్యాడ్‌న్యూస్‌.. గోల్డ్‌ ధర ఎంత పెరిగిందో తెలుసా
తెలుగులో తోప్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఐటీ జాబ్
తెలుగులో తోప్ హీరోయిన్.. ఇప్పుడు సినిమాలు మానేసి ఐటీ జాబ్
కేకేఆర్ ఇజ్జత్‌కే సవాల్.. గెలిస్తేనే నిలిచేది.. లేదంటే ప్యాకప్?
కేకేఆర్ ఇజ్జత్‌కే సవాల్.. గెలిస్తేనే నిలిచేది.. లేదంటే ప్యాకప్?
షాహిద్‌ అఫ్రిది ఓ జోకర్‌.. నా ముందు అతని గురించి మాట్లాడొద్దు..
షాహిద్‌ అఫ్రిది ఓ జోకర్‌.. నా ముందు అతని గురించి మాట్లాడొద్దు..
ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల నష్టాలు కూడా ఉంటాయని మీకు తెలుసా?
ఫాస్ట్ ఛార్జింగ్ వల్ల నష్టాలు కూడా ఉంటాయని మీకు తెలుసా?
సెకండ్ హ్యాండ్ కారు తీసుకొంటున్నారు.? ముందుగా ఇవి తెలుసుకోండి..!
సెకండ్ హ్యాండ్ కారు తీసుకొంటున్నారు.? ముందుగా ఇవి తెలుసుకోండి..!
బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం.. 12 ఫైరింజన్లతో
బహుళ అంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం.. 12 ఫైరింజన్లతో
100 గంటల్లోనే గట్టిగా ఇచ్చేశాడు భయ్యో.. సెహ్వాగ్‌కు దిమ్మతిరిగేలా
100 గంటల్లోనే గట్టిగా ఇచ్చేశాడు భయ్యో.. సెహ్వాగ్‌కు దిమ్మతిరిగేలా
RR మ్యాచ్ లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న గిల్! కారణమిదే
RR మ్యాచ్ లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న గిల్! కారణమిదే