AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భాగ్యనగరంలో మరో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు

హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్ దందాపై అధికారులు డేగకన్నువేశారు. ఇప్పటికే ఎప్పటికప్పుడు పలుచోట్ల తనిఖీలు చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తుల్ని ముఠాలను అధికారులు అరెస్టులు చేస్తున్నారు.

భాగ్యనగరంలో మరో డ్రగ్స్‌ ముఠా గుట్టురట్టు
Balaraju Goud
|

Updated on: Oct 27, 2020 | 7:34 PM

Share

హైదరాబాద్ మహానగరంలో డ్రగ్స్ దందాపై అధికారులు డేగకన్నువేశారు. ఇప్పటికే ఎప్పటికప్పుడు పలుచోట్ల తనిఖీలు చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తుల్ని ముఠాలను అధికారులు అరెస్టులు చేస్తున్నారు. భాగ్యనగరంలో డ్రగ్ మాఫియా వ్యాపించకుండా అడ్డుకట్ట వేస్తున్నారు. తాజాగా నగరంలోని వెస్ట్‌జోన్‌ పరిధిలో డ్రగ్స్‌ పట్టుబడింది. మంగళహాట్‌ సమీపంలో డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చరస్‌ అమ్ముతున్న సురాజ్‌ సింగ్‌, లలిత్‌కుమార్‌ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.  నిందితుల వ‌ద్ద నుంచి 40 గ్రాముల ఛ‌ర‌స్‌ను స్వాధీనం చేసుకున్నారు.  చరస్‌ ఒక గ్రాము రూ.1800లకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ అమ్ముతున్నట్లు పక్కా సమాచారాన్ని అందుకున్న అధికారులు దాడులు చేశారు. ఈ సోదాల్లో డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.