Sirkali robbery: తమిళనాడులో రెచ్చిపోయిన దుండగులు.. ఇద్దరిని హత్య చేసి.. 15 కిలోల బంగారం చోరీ

|

Jan 27, 2021 | 1:49 PM

తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. ఓ బంగారం వ్యాపారి కుటుంబీకులను హత్య చేసిన దుండగులు.. 15 కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే.. 

Sirkali robbery:  తమిళనాడులో రెచ్చిపోయిన దుండగులు.. ఇద్దరిని హత్య చేసి.. 15 కిలోల బంగారం చోరీ
Follow us on

 Sirkali robbery:  తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. ఓ బంగారం వ్యాపారి కుటుంబీకులను హత్య చేసిన దుండగులు.. 15 కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే..  మయిళదుతురాయ్​ జిల్లాలోని సిర్కాళీ రైల్వే రోడ్డులో నివసించే ధన్​రాజ్​(50).. బంగారం వ్యాపారం చేస్తూ కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. బుధవారం ఉదయం ఓ నలుగురు దుండగులు అతడి ఇంట్లోకి ప్రవేశించారని పోలీసులు తెలిపారు. ధన్​రాజ్​ భార్య ఆశ(42), అతని కుమారుడు అఖిల్​(24)ను హత్య చేసి 15 కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారని తెలిపారు. సీసీటీవీ హార్డ్​డిస్క్​లను కూడా నిందితులు తీసుకువెళ్లారని వివరించారు.

 స్థానికంగా ఈ ఉదంతం కలకలం రేపింది.  ఘటనపై పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక సమాచారం ఆధారంగా నిందితులను నార్త్ ఇండియన్స్‌గా గుర్తించారు.

Also Read:

క్రికెట్‌ బెట్టింగ్ భూతానికి మరో యువకుడు బలి… పురుగుల మందు తాగి ఆత్మహత్య

Online Loan Apps: ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ కేసులో దర్యాప్తు ముమ్మరం.. ఈ దారుణ దందాలో మరో ఐదుగురు చైనీయులు