AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్‌ను ఢీకొన్న బస్సు.. నలుగురు మృతి

ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు పసలురు శ్రీరాములు, నాగార్జున, చిన్న తిప్పయ్య, కుమ్మర శ్రీనివాస్‌లుగా గుర్తించారు. మృతులంతా గుత్తి మండలం మామిడూరుకు చెందిన వారిగా గుర్తించారు. ఓ రైస్ మిల్లు నుంచి ట్రాక్టర్ లోకి బియ్యం బస్తాలు వేసుకుని... తిరిగి గుత్తి వైపు వెళ్తుండగా..

Road Accident: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్‌ను ఢీకొన్న బస్సు.. నలుగురు మృతి
Road Accident
Subhash Goud
|

Updated on: Dec 23, 2023 | 7:06 AM

Share

దేశంలో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వాహనదారుల నిర్లక్ష్యం, ఓవర్‌టెక్‌, అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం తదితర కారణాల వల్ల రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుని ఎందరో బలవుతున్నారు. ఇక తాజాగా శనివారం ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అనంతపుంర జిల్లా గార్లదిన్నె మండలం కల్లూరు వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ట్రాక్టర్ ను అతివేగంతో ప్రైవేట్ ట్రావెల్ వోల్వో బస్సు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాదంలో ట్రాక్టర్‌లో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానికులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులు పసలురు శ్రీరాములు, నాగార్జున, చిన్న తిప్పయ్య, కుమ్మర శ్రీనివాస్‌లుగా గుర్తించారు. మృతులంతా గుత్తి మండలం మామిడూరుకు చెందిన వారిగా గుర్తించారు.

కాగా, ఓ రైస్ మిల్లు నుంచి ట్రాక్టర్ లోకి బియ్యం బస్తాలు వేసుకుని… తిరిగి గుత్తి వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వోల్వో బస్సు ఢీకొనడంతో బియ్యం బస్తాలు సైతం రోడ్డు దాటి ఎగిరిపడ్డాయి. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళుతుండగా అతివేగంతో ఓల్వో బస్సు ఢీకొనటంతో రోడ్డు ప్రమాదం జరిగినట్లు చెబుతున్న స్థానికులు.