AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిస్టరీ మరణాలు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్య?

కృష్ణా జిల్లాలోని విస్సన్నపేట శివారులో ముగ్గురు సంచార చిరు వ్యాపారులు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు

మిస్టరీ మరణాలు.. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు హత్య?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 05, 2020 | 11:44 AM

Share

Krishna district mystery deaths: కృష్ణా జిల్లాలోని విస్సన్నపేట శివారులో ముగ్గురు సంచార చిరు వ్యాపారులు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. సోమవారం ఉదయం మూడు మృతదేహాలను అక్కడి స్థానికులు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హత్యకు గురైన వారిలో మహిళ, యువతితో పాటు ఓ యువకుడు ఉన్నారు.

మృతులు నూజివీడు మండలం కొత్త ఈదర గ్రామానికి చెందిన చిన్నస్వామి, తిరుపతమ్మ, మీనాక్షిలుగా పోలీసులు గుర్తించారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారని నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడ్డారా..? లేక ఎవరు హత్య చేసి ఉంటారా..? వీరి హత్యకు గల కారణాలేంటి..? వంటి ప్రశ్నలపై పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు.

Read More:

చనిపోయిన భర్త ఫొటోతో నటి మేఘనా రాజ్‌ సీమంతం

‘కార్తికేయ 2’ సెట్స్‌పైకి వెళ్లేది అప్పుడే