Rajasthan: బావిలో దూకిన అక్కాచెల్లెళ్లు.. చిన్నారులతో సహా ఐదుగురు మృతి.. కారణం అదేనా..?

|

May 28, 2022 | 7:56 PM

రాజస్థాన్(Rajastan) జైపుర్​లో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్నో ఆశలతో అత్తింట్లోకి అడుగుపెట్టిన ముగ్గురు అక్కాచెల్లెళ్లకు అడుగడుగునా వేధింపులే స్వాగతం పలికాయి. ఎలాగోలా సర్దుకుని కలిసి ఉందామనుకున్నప్పటికీ.. రోజురోజుకు పెరిగిపోతున్న...

Rajasthan: బావిలో దూకిన అక్కాచెల్లెళ్లు.. చిన్నారులతో సహా ఐదుగురు మృతి.. కారణం అదేనా..?
crime news
Follow us on

రాజస్థాన్(Rajastan) జైపుర్​లో తీవ్ర విషాదం నెలకొంది. ఎన్నో ఆశలతో అత్తింట్లోకి అడుగుపెట్టిన ముగ్గురు అక్కాచెల్లెళ్లకు అడుగడుగునా వేధింపులే స్వాగతం పలికాయి. ఎలాగోలా సర్దుకుని కలిసి ఉందామనుకున్నప్పటికీ.. రోజురోజుకు పెరిగిపోతున్న వేధింపులతో తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. పిల్లలతో కలిసి పుట్టింటికి పయనమయ్యారు. పుట్టింటి వారు సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో గత్యంతరం లేకు ముగ్గురు అక్కాచెల్లెళ్లు తమ పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకొని దుదూస్టేషన్ పోలీసులు, అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ముగ్గురు మహిళలు అక్కాచెల్లెళ్లు అని పోలీసులు తెలిపారు. వీరిని కాలీ దేవి(27), మమతా దేవి(23), కమ్లేశ్​ మీనాగా(20) గుర్తించారు. చనిపోయిన చిన్నారుల్లో నాలుగేళ్ల బాలుడు హర్షిత్, 20 రోజుల శిశువు ఉన్నట్టు వెల్లడించారు.

రాజస్థాన్ లోని జైపుల్ రూరల్ ప్రాంతానికి చెందిన ముగ్గురు అక్కాచెల్లెళ్లకు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులతో వివాహమైంది. పెళ్లయినప్పటికి నుంచి వారికి అత్తింటి వేధింపులు ప్రారంభమయ్యాయి. పది రోజలు క్రితం ముగ్గురు అక్కా చెల్లెళ్లను తీవ్రంగా కొట్టి, ఇంట్లో నుంచి గెంటేశారు. గత్యంతరం లేక ముగ్గురూ తమ పుట్టింటికి వచ్చారు. గొడవను పరిష్కరించేందుకు బాధిత మహిళల కుటుంబసభ్యులు ప్రయత్నించినప్పటికీ ఫలించలేదు. ఇక చేసేదేమీ లేక ముగ్గురూ తమ పిల్లలతో కలిసి బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. మార్కెట్​కు వెళ్తామని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహిళలు.. తిరిగి రాలేదని మృతుల కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు సరిగ్గా స్పందించలేదని మృతుల కుటుంబీకులు ఆవేదన చెందారు.

ఇదే సమయంలో పోలీసులకు బావిలో ముగ్గురు మహిళలు, ఇద్దరు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటన జరిగి 24 గంటలు అయినా.. పోలీసులు స్పందించకపోవడంతో తాము మహిళా కమిషన్​ను ఆశ్రయించామని బాధితులు తెలిపారు. అనంతరం పోలీసు ఉన్నతాధికారులనూ కలిశామన్నారు. అయితే, ఉన్నతాధికారుల వద్ద ఫిర్యాదు చేయొద్దని స్థానిక ఎమ్మెల్యే తమపై ఒత్తిడి చేశారని ఆవేదన చెందారు. ఈ ఘటనపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలీసులు స్పందించారని వెల్లడించారు. కట్నం కోసం తమను వేధించారని మృతుల సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి