AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beggar Murder: బిచ్చగాడిని హత్య చేసిన ముగ్గురు వ్యక్తులు.. కారణం ఏంటో తెలుసుకుని షాకైన పోలీసులు..!

Beggar Murder: రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. సాధారణంగా భూ వివాదాలు, ఆర్థికలావాదేవీలు, ఇతర పగ ప్రతీకారాలతో హత్యలు జరుగుతుంటాయి. కానీ ఏపీలోని..

Beggar Murder: బిచ్చగాడిని హత్య చేసిన ముగ్గురు వ్యక్తులు.. కారణం ఏంటో తెలుసుకుని షాకైన పోలీసులు..!
Subhash Goud
|

Updated on: May 06, 2022 | 3:16 PM

Share

Beggar Murder: రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. సాధారణంగా భూ వివాదాలు, ఆర్థికలావాదేవీలు, ఇతర పగ ప్రతీకారాలతో హత్యలు జరుగుతుంటాయి. కానీ ఏపీలోని గుంటూరు అర్బన్‌ (Guntur Urban) పరిధిలో మాత్రం ఓ బిచ్చగాడిని హత్య చేయడం కలకలం రేపుతోంది. ముగ్గురు వ్యక్తులు కలిసి ఓ బిచ్చగాడిని దారుణంగా కొట్టి హత్య చేశారు. మరి బిచ్చగాడిని హత్య చేసే పనేముందనేగా మీ అనుమానం.. అసలు కారణాలు తెలుసుకున్న పోలీసులు సైతం షాక్‌కు గురయ్యారు. వివరాల్లోకి వెళితే.. గుంటూరు అర్బన్ నల్లపాడు పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ బిచ్చగాడిని మద్యం మత్తులో ముగ్గురు స్నేహితులు హత్య చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీరా బిచ్చగాడిని హత్యకు గల కారణాలను తెలుసుకున్న పోలీసులు షాక్‌కు గురయ్యారు. గుంటూరు హోసింగ్ బోర్డు కాలనీలో ఓ వ్యక్తి స్థానికంగా బిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మే 1న అర్ధ రాత్రి సమయంలో మహేష్ అనే వ్యక్తి మద్యం సేవించి వచ్చి.. తనతో తెచ్చుకున్న ఇడ్లీ పొట్లాన్ని బిచ్చగాడికి ఇచ్చాడు.

పొట్లం ఇస్తూనే.. నువ్వు చడ్డీ గ్యాంగ్ ముఠా సభ్యుడిలా ఉన్నావ్, పోలీసులతో జాగ్రత్త అంటూ వ్యంగ్యంగా మాట్లాడాడు. మహేష్ మాటలకు బాధపడ్డ బిచ్చగాడు మహేష్ ఇచ్చిన ఇడ్లీ పొట్లాన్ని విసిరేశాడు. దీంతో కోపంతో ఊగిపోయిన మహేష్.. అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో మరో ఇద్దరు స్నేహితులు అనిల్, సతీష్‌తో కలిసి వచ్చి బిచ్చగాడిని కొట్టారు. అది కూడా చాలదన్నట్టు బిచ్చగాడిని ద్విచక్ర వాహనంపై ఎక్కించుకెళ్లి.. అంకిరెడ్డిపాలెం డొంక రోడ్డులోకి ముగ్గుముగ్గరు కూడా విచక్షణ రహితంగా బిచ్చగాడిపై దాడి చేశారు. దెబ్బలు తాళలేక బిచ్చగాడు అక్కడికక్కడే మృతి చెందాడు. బిచ్చగాడు మృతి చెందిన విషయాన్నీ గమనించి మహేష్, అనిల్, సతీష్ అక్కడి నుంచి పరారయ్యారు. బిచ్చగాడి మృతిపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు. ముగ్గురు నిందితులను గురువారం అదుపులోకి తీసుకున్నారు. మహేష్, అనిల్, సతీష్ లు స్థానికంగా ముఠా పనులకు వెళ్తుంటారని.. ఇడ్లి ఇస్తే తినలేదని కారణంతోనే మద్యం మత్తులో బిచ్చగాడని కొట్టినట్లు నిందితులు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరచామని డిఎస్పీ జెస్సి ప్రశాంతి తెలిపారు.

రిపోర్టర్: టి నాగరాజు, టివి9 తెలుగు, గుంటూరు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Hyderabad: కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరిన భార్య.. మనోవేదనతో భర్త ఏం చేశాడంటే..

Telangana: ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. భర్త సినిమాకి తీసుకెళ్లడానికి ‘నో’ చెప్పాడని భార్య ఆత్మహత్య

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?