Viral News: వాష్ రూమ్‌కి వెళ్లొచ్చేసరికి బ్యాగ్ మాయం.. టవల్‌తోనే పోలీస్ స్టేషన్‌కు.. చివరకు

తన బ్యాగు పోయిందని ఓ యువకుడు మరో ప్రయాణికుడి బ్యాగును చోరీ చేశాడు. వాష్‌రూమ్‌కు వెళ్లొచ్చేసరికి తన బ్యాగు, బట్టలు లేకపోవడంతో...

Viral News: వాష్ రూమ్‌కి వెళ్లొచ్చేసరికి బ్యాగ్ మాయం.. టవల్‌తోనే పోలీస్ స్టేషన్‌కు.. చివరకు
Bag Thief

Updated on: Aug 05, 2021 | 3:05 PM

తన బ్యాగు పోయిందని ఓ యువకుడు మరో ప్రయాణికుడి బ్యాగును చోరీ చేశాడు. వాష్‌రూమ్‌కు వెళ్లొచ్చేసరికి తన బ్యాగు, బట్టలు లేకపోవడంతో బాధితుడు టవల్‌తోనే పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని శ్రీకాకుళానికి చెందిన మూల సునీల్‌కుమార్‌(24) హైదరాబాద్​కు ట్రైన్‌లో వస్తుండగా అతని బ్యాగు పోయింది. దీంతో మరొకరి బ్యాగును చోరీ చేయాలని మెంటల్‌గా డిసైడయ్యాడు. అనుకున్నదే తడవుగా.. మంగళవారం ఉదయం రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. ఆ సమయంలో విజయనగరంలో టీవీ రిపోర్టర్‌గా పనిచేస్తున్న శివశంకర్‌ రైలు దిగాడు. మీటింగ్‌ కోసం నేరుగా ఆఫీసుకు వెళ్లాల్సి ఉండడంతో వెయిటింగ్‌ హాల్‌లో బ్యాగును ఉంచి స్నానం చేసేందుకు వాష్‌రూమ్‌కు వెళ్లాడు. అతను తిరిగొచ్చేలోపు దుస్తులు, సెల్‌ఫోన్‌, రూ.7వేలు నగదు ఉన్న బ్యాగు చోరీకి గురైంది. ఒంటిపై టవల్‌తో మాత్రమే ఉన్న అతడు అలాగే జీఆర్పీ పోలీసుస్టేషన్‌కు వెళ్లి తన బ్యాగు కనిపించడం లేదని కంప్లైంట్ చేశాడు.

పోలీసులు అతడికి వారి వద్ద ఉన్న బట్టలు ఇచ్చారు. పోలీసుల మొబైల్‌ నుంచి బాధితుడు తన మిత్రులకు ఫోన్‌ చేశాడు. వారు వచ్చాక దుస్తులు కొనుక్కొని ఆఫీసుకు వెళ్లాడు. పోలీసులు సీసీకెమెరాలను పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి  రూ.7వేల నగదు, బ్యాగుతోపాటు సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

Also Read: Shilpa Shetty: దెబ్బ మీద దెబ్బ.. పాపం శిల్పాకు ఇదేం పరిస్థితి అబ్బా..!

 ఏపీలోని ఆ ప్రాంతాలలో ఉధృతంగా కరోనా వ్యాప్తి.. కర్ఫ్యూ విధింపు

Loading...
Unable to load recommendations.
Follow Us