AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత మత్స్యకారులపై శ్రీలంక నేవీ దాడి

అంతర్జాతీయ సరిహద్దు నిబంధనలను ఉల్లంఘించి తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారంటూ శ్రీలంక నేవీ సిబ్బంది భారత మత్స్యకారులపై దాడి చేశారు.

భారత మత్స్యకారులపై శ్రీలంక నేవీ దాడి
Balaraju Goud
|

Updated on: Oct 27, 2020 | 4:27 PM

Share

అంతర్జాతీయ సరిహద్దు నిబంధనలను ఉల్లంఘించి తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారంటూ శ్రీలంక నేవీ సిబ్బంది భారత మత్స్యకారులపై దాడి చేశారు. ఈ ఘటనలో ఓ మత్స్యకారుడు తీవ్రంగా గాయపడ్డారు. అయితే, శ్రీలంక నేవీ కావాలనే తమపై దాడి చేసిందని, తాము విదేశీ జలాల్లోకి ప్రవేశించలేదని మత్స్యకారులు చెబుతున్నారు. తమపై రాళ్లు విసిరారని, వలలను చింపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన మత్స్యకారుడిని తమిళనాడులోని రామేశ్వరానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్ప పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.

తమిళనాడుకు చెందిన మత్స్యకారులపై శ్రీలంక నేవీ సిబ్బంది దాడి చేయడం తరుచు పరిపాటిగా మారిపోయింది. ఇప్పటికే పలుమార్లు ఇలాంటి సంఘటనలు వెలుగుచూశాయి. కొన్నిసార్లు మత్స్యకారులను అక్రమంగా అరెస్ట్ చేసిన శ్రీలంక అధికారులు జైలులో బంధించిన సందర్భాలూ ఉన్నాయి. ఇలాంటి ఘటనలను తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. భారత మత్స్యకారులపై శ్రీలంక నేవీ సిబ్బంది దాడులకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి ఇది వరకే లేఖ రాసింది. హిందూమహాసముద్రంలో ఇలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతుంది.