AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: విషాదయాత్రగా మారిన విహార యాత్ర.. అనకాపల్లి ఘటనలో ఆరు మృతదేహాలు లభ్యం

సరదాగా విహారానికి వెళ్లిన వారి యాత్ర విషాదయాత్రగా మారింది. స్నేహితులతో కలిసి బీచ్ కు వెళ్లిన వారిని రాకాసి అలలు మింగేశాయి. అనకాపల్లి జిల్లాలోని సీతాపాలెం వద్ద విద్యార్థులు గల్లంతు ఘటన తీవ్ర విషాదం నింపింది. గల్లంతైన వారిలో నిన్న ఒకరి...

Andhra Pradesh: విషాదయాత్రగా మారిన విహార యాత్ర.. అనకాపల్లి ఘటనలో ఆరు మృతదేహాలు లభ్యం
Vizag Beach Incident
Follow us
Ganesh Mudavath

|

Updated on: Jul 30, 2022 | 3:29 PM

సరదాగా విహారానికి వెళ్లిన వారి యాత్ర విషాదయాత్రగా మారింది. స్నేహితులతో కలిసి బీచ్ కు వెళ్లిన వారిని రాకాసి అలలు మింగేశాయి. అనకాపల్లి జిల్లాలోని సీతాపాలెం వద్ద విద్యార్థులు గల్లంతు ఘటన తీవ్ర విషాదం నింపింది. గల్లంతైన వారిలో నిన్న ఒకరి మృతదేహం లభ్యమవగా నేడు మరో ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. దీంతో సముద్రంలో కొట్టుకుపోయిన వారందరూ చనిపోవడం వారి వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం అనకాపల్లి ప్రభుత్వం ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనకాపల్లిలోని (Anakapalle) దాడి ఇంజినీరింగ్‌ కళాశాల (డైట్‌)లో రెండో సంవత్సరం చదువుతున్న 15 మంది విద్యార్థులు శుక్రవారం పరీక్షలు రాసి, రాంబిల్లి మండలంలోని సీతపాలెం బీచ్ కు వెళ్లారు. గోపాలపట్నానికి చెందిన జగదీశ్, గుంటూరుకు చెందిన సతీశ్, అనకాపల్లి జిల్లా రోలుగుంటకు చెందిన జశ్వంత్‌, మునగపాకకు చెందిన సూరిశెట్టి తేజ, చూచుకొండకు చెందిన పెంటకోట గణేశ్, యలమంచిలికి చెందిన పూడి రామచందు, నర్సీపట్నం మండలం పెద్దబొడ్డేపల్లికి చెందిన గుడివాడ పవన్‌ మరో ఎనిమిది మందితో కలిసి సముద్ర తీరానికి వెళ్లారు.

సంతోషంగా కేరింతలు కొడుతూ ఆనందంగా సముద్రంలో స్నానం చేస్తుండగా ఓ పెద్ద అల వారిని లోపలికి లాక్కెళ్లింది. వెంటనే అప్రమత్తమైన తోటి స్నేహితులు.. రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశారు. అక్కడే ఉన్న జాలర్లు సూరిశెట్టి తేజను కొన ఊపిరితో బయటకు లాగారు. అతను ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పవన్‌ డెడ్ బాడీ నిన్న (శుక్రవారం) సాయంత్రమే లభ్యమైంది. సమాచారం అందుకున్న నేవీ హెలికాప్టర్‌, కోస్ట్‌ గార్డ్స్‌, మెరైన్‌ పోలీసులు బోట్లు, మత్స్యకారుల సహాయంతో గాలింపు చేపట్టారు.

ఈ క్రమంలో ఇవాళ (శనివారం) ఉదయం హెలికాప్టర్లతో గాలిస్తుండగా నలుగురు విద్యార్థుల మృతదేహాలు గుర్తించారు. వాటిని ఒడ్డుకు చేర్చి, మళ్లీ గాలించగా మరో విద్యార్థి జశ్వంత్‌ మృతదేహాన్ని తంతడి తీరంలో గుర్తించారు. గల్లంతైన ఏడుగురు విద్యార్థుల్లో ఒకరు ప్రాణాలతో బయటపడగా.. ఆరుగురు మృతి చెందారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఏపీ వార్తలు చదవండి..

'ముందు నీ స్ట్రైక్ రేట్ చూసుకో.. కోహ్లీ జోలికొస్తే ఊరుకోం'
'ముందు నీ స్ట్రైక్ రేట్ చూసుకో.. కోహ్లీ జోలికొస్తే ఊరుకోం'
అక్షయ తృతీయ రోజు బంగారం కాకుండా.. తప్పక కొనాల్సిన వస్తువులు ఏవంటే
అక్షయ తృతీయ రోజు బంగారం కాకుండా.. తప్పక కొనాల్సిన వస్తువులు ఏవంటే
అలాంటి పరిస్థితి ఏ ఆర్టిస్టుకు రాకూడదు.. ఈ నటి కష్టాలు తెలిస్తే..
అలాంటి పరిస్థితి ఏ ఆర్టిస్టుకు రాకూడదు.. ఈ నటి కష్టాలు తెలిస్తే..
ఆ బౌలరంటే ముంబై ఇండియన్స్‌కు భయం: రాయుడు
ఆ బౌలరంటే ముంబై ఇండియన్స్‌కు భయం: రాయుడు
తండ్రి షాపులో రూ.2 లక్షలు చోరీ.. ఐఫోన్‌ కొన్న ఏడో తరగతి పిల్లోడు!
తండ్రి షాపులో రూ.2 లక్షలు చోరీ.. ఐఫోన్‌ కొన్న ఏడో తరగతి పిల్లోడు!
టాలీవుడ్ షూటింగ్స్‎తో కళ కళ.. హీరోలు అందరూ సెట్స్‎లోనే..
టాలీవుడ్ షూటింగ్స్‎తో కళ కళ.. హీరోలు అందరూ సెట్స్‎లోనే..
5 సినిమాలు చేస్తే నాలుగు సూపర్ హిట్టే..
5 సినిమాలు చేస్తే నాలుగు సూపర్ హిట్టే..
అజహరుద్దీన్ పేరు తొలగించొద్దు.. హెచ్‌సీఏకు షాకిచ్చిన హైకోర్ట్
అజహరుద్దీన్ పేరు తొలగించొద్దు.. హెచ్‌సీఏకు షాకిచ్చిన హైకోర్ట్
కొత్త సమస్యతో బాధపడుతోన్న పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్
కొత్త సమస్యతో బాధపడుతోన్న పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్
చార్ ధామ్ యాత్ర ప్రారంభం.. తెరుచుకున్న యమునోత్రి ఆలయ ద్వారాలు..
చార్ ధామ్ యాత్ర ప్రారంభం.. తెరుచుకున్న యమునోత్రి ఆలయ ద్వారాలు..