Watch Horrific Video: ఆకాశమంత వ్యధ..! నిండు గర్భిణీతోసహా భర్త సజీవ దహనం.. అసలేం జరిగిందంటే..

|

Feb 02, 2023 | 7:02 PM

పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండుగర్భిణీ అయిన భార్యను కారులో ఆసుపత్రికి తరలిస్తున్నాడో భర్త. ఇంతలో కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో భార్యతోపాటు భర్త కూడా కారులోనే సజీవ దహనమయ్యారు. కేరళ రాష్ట్రంలో గురువారం నాడు..

Watch Horrific Video: ఆకాశమంత వ్యధ..! నిండు గర్భిణీతోసహా భర్త సజీవ దహనం.. అసలేం జరిగిందంటే..
Pregnant Woman Died
Follow us on

పురిటి నొప్పులతో బాధపడుతున్న నిండుగర్భిణీ అయిన భార్యను కారులో ఆసుపత్రికి తరలిస్తున్నాడో భర్త. ఇంతలో కారులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో భార్యతోపాటు భర్త కూడా కారులోనే సజీవ దహనమయ్యారు. కేరళ రాష్ట్రంలో గురువారం నాడు ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. మృతులను కన్నూర్‌ జిల్లా కుత్తియాత్తూరుకు చెందిన ప్రిజిత్ (35), అతని భార్య రీషా (26)గా గుర్తించారు.

ప్రసవ నొప్పులతో బాధపడుతున్న రీషాను 2020 మోడల్ మారుతి ఎస్-ప్రెస్సో కారులో జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో కారులో మొత్తం ఆరుగురు ప్రయాణిస్తున్నారు. ఐతే వాహనంలో మంటలు చెలరేగడంతో వెనుక సీట్లో కూర్చున్న చిన్నారితో సహా నలుగురు బయటకు దూకారు. కారు ముందు భాగంలో మంటలు పెద్ద ఎత్తున చెలరేగడంతో డోర్లు ఓపెన్‌కాలేదు. దీంతో ముందు సీట్లో కూర్చున్న ప్రిజిత్-రీషా కారులోనే చిక్కుకుపోయారు. స్థానికులు పరుగుపరుగున వచ్చి కారులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీం మంటలను అదుపుచేసి, ప్రిజిత్, రీషాలను బయటకు తీశారు. ఐతే అప్పటికే వారు మృతి చెందినట్లు గుర్తించారు. మృతులతోసహా గాయాలపాలైన నలుగురిని కూడా ఆసుపత్రికి తరలించినట్లు కన్నూర్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ అజిత్‌ కుమార్‌ మీడియాకు తెలియజేశారు. సాంకేతిక నిపుణులు పరిశీలించిన తర్వాత అగ్నిప్రమాదానికి గల కారణాలను నిర్ధారించగలమని ఆయన తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.