AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ల్యాండ్ వ్యవహారంలో జోక్యం.. సీఐ, ఎస్ఐల సస్పెన్షన్

భూ వివాదంలో తలదూర్చిన ఇద్దరు పోలీసులపై వేటు పడింది. రియల్టర్ల భూ తగాదాలో జోక్యం చేసుకున్నందుకు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట సీఐ ఏవీ రంగ, మోత్కూరు ఎస్సై సీహెచ్‌ హరిప్రసాద్‌లను సస్పెన్షన్ విధిస్తూ సీపీ మహేష్‌ భగవత్‌ ఉత్తర్వులు.

ల్యాండ్ వ్యవహారంలో జోక్యం.. సీఐ, ఎస్ఐల సస్పెన్షన్
Balaraju Goud
| Edited By: |

Updated on: Jul 19, 2020 | 6:48 PM

Share

భూ వివాదంలో తలదూర్చిన ఇద్దరు పోలీసులపై వేటు పడింది. రియల్టర్ల భూ తగాదాలో జోక్యం చేసుకున్నందుకు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట సీఐ ఏవీ రంగ, మోత్కూరు ఎస్సై సీహెచ్‌ హరిప్రసాద్‌లను సస్పెన్షన్ విధిస్తూ సీపీ మహేష్‌ భగవత్‌ నిర్ణయం తీసుకున్నారు. వీరిద్దరినీ రాచకొండ కమిషనర్‌ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. నల్లగొండ జిల్లా అమ్మనబోలులో మోత్కూరు మండలం కొండగడపకు చెందిన అంబటి నర్సయ్య, బండ యాదయ్యతో పాటు మరికొందరు రైతులు 10.2 ఎకరాల భూమిని చేర్యాలకు చెందిన పెద్ది ప్రశాంత్‌కు విక్రయించారు. అయితే, అగ్రిమెంటు ప్రకారం ప్రశాంత్‌ రిజిస్ట్రేషన్‌ చేయించుకోకపోవడంతో వీరి మధ్య వివాదం రాజుకుంది.

మరోవైపు, అంబటి నర్సయ్య, అంబటి చంద్రయ్య, పురుషోత్తంల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో దాయాదులు పరస్పరం పోలీసుస్టేషన్‌లో కేసులు పెట్టుకున్నారు. స్థానిక పోలీసులు ఇరువురి మధ్య రాజీ కుదిర్చేందుకు యత్నించారు. ఇంతలో రామన్నపేట సీఐ ఏవీ రంగ, మోత్కూరు ఎస్‌ఐ హరిప్రసాద్ జోక్యం చేసుకుని అమ్మనబోలు భూ తగాదా పరిష్కరించుకుంటేనే ఈ కేసు రాజీ కుదురుస్తామంటూ లింక్‌ పెట్టి కేసు కొట్టిశారు. ఈ విషయంపై అంబటి నర్సయ్య రాచకొండ సీపీ మహేష్ భగవత్ కు ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ చేపట్టిన సీపీ సీఐ, ఎస్సైలపై వేటు వేశారు. వీరిద్దరిని సస్పెండ్ చేస్తూ కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చే