పెట్రోల్ బంక్ ఆపరేటర్ దారుణ హత్య
నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని రింగ్ రోడ్డు ప్రాంతలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు వద్ద సోమవారం రాత్రి దారుణ హత్య చేటు చేసుకుంది. ఈ పెట్రోల్ బంకులో ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
నిజామాబాద్ జిల్లా బాల్కొండలోని రింగ్ రోడ్డు ప్రాంతలో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకు వద్ద సోమవారం రాత్రి దారుణ హత్య చేటు చేసుకుంది. ఈ పెట్రోల్ బంకులో ఆపరేటర్గా విధులు నిర్వహిస్తున్న ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాల్కొండలో నివసించే కోటగిరి రామకృష్ణ(45) ఇండియన్ పెట్రోల్ బంకులో ఆపరేటర్గా పని చేస్తున్నాడు. రోజులాగే సోమవారం సాయంత్రం కూడా డ్యూటికి వెళ్లాడు. రాత్రి అక్కడే పడుకున్నాడు. అర్థరాత్రి సమయంలో గుర్తు తెలియని దుండగులు అతడి తలపై రాయితో మోది దారుణంగా హత్య చేశారు. మంగళవారం ఉదయం రక్తపు మడుగులో పని ఉన్న అతన్ని చూసిన పెట్రోల్ సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. డాగ్ స్క్వాడ్తో గాలింపు చర్యలు చేపట్టారు. పెట్రోల్ బంకులో సీసీ కెమెరాలు లేకపోవడంతో.. నిందితులను పట్టుకునేందుకు పోలీసుకు కష్టంగా మారింది. కాగా మృతుడికి భార్య, ఒక కుమారుడు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
Also Read:
ఆ ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం జగన్ గుడ్ న్యూస్
బిగ్బాస్-4 కంటెస్టెంట్కి కరోనా పాజిటివ్?
కరోనా వైరస్తో ఆర్మీ జవాను మృతి