రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చత్తీస్ఘడ్ పర్యటనలో ఉన్న కారణంగా ఆయన తిరిగి వచ్చిన తర్వాతే పవన్ గుప్తా మెర్సీ పిటిషన్పై నిర్ణయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీంతో నిర్భయ దోషుల రేపటి ఉరిపై మళ్లీ సస్పెన్స్ కొనసాగుతోంది. మొదట మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో పటియాలా హౌస్ కోర్టు ఇచ్చిన తీర్పు మేరకు.. రేపు ఉదయం 6.00 గంటలకు ఉరితీయాల్సి ఉంది. అయితే తాజాగా డెత్వారెంట్లపై కోర్టు స్టే విధించడంతో.. మళ్లీ ఉరిపై ట్విస్ట్ నెలకొంది.