AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఒక్క ఫోన్ కాల్.. అంతా ఉష్..!

టెక్నాలజీని వాడుకుంటూ ఈజీగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడిన కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక్క ఫోన్ కాల్‌తో ఓ వ్యాపారిని బురిడీ కొట్టించి నిండా ముంచేశాడు. హైదరాబాద్ రామంతాపూర్‌కు చెందిన ఓ వ్యాపారికి.. తాను ఎయిర్‌టెల్ ఆఫీస్ ప్రతినిధి కిషోర్ అంటూ ఒక వ్యక్తి కాల్ చేశాడు. త్వరలోనే మీ సిమ్ బ్లాక్ అవుతుందని.. అలా కాకుండా ఉండాలంటూ యూపీఐ అకౌంట్ నుంచి 10 రూపాయలు చెల్లించాలని నమ్మించాడు. తనకు యూపీఐ అకౌంట్ లేదని సదరు […]

ఒక్క ఫోన్ కాల్.. అంతా ఉష్..!
Pardhasaradhi Peri
|

Updated on: Jun 15, 2019 | 2:24 PM

Share

టెక్నాలజీని వాడుకుంటూ ఈజీగా డబ్బు సంపాదించడానికి అలవాటు పడిన కొందరు మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఒక్క ఫోన్ కాల్‌తో ఓ వ్యాపారిని బురిడీ కొట్టించి నిండా ముంచేశాడు. హైదరాబాద్ రామంతాపూర్‌కు చెందిన ఓ వ్యాపారికి.. తాను ఎయిర్‌టెల్ ఆఫీస్ ప్రతినిధి కిషోర్ అంటూ ఒక వ్యక్తి కాల్ చేశాడు. త్వరలోనే మీ సిమ్ బ్లాక్ అవుతుందని.. అలా కాకుండా ఉండాలంటూ యూపీఐ అకౌంట్ నుంచి 10 రూపాయలు చెల్లించాలని నమ్మించాడు. తనకు యూపీఐ అకౌంట్ లేదని సదరు వ్యాపారి తెలిపాడు. అలా అయితే తాను పంపించే మెసెజ్‌ను మరో నంబర్‌కు ఫార్వర్డ్ చేయాలని చెప్పాడు. దాంతో వ్యాపారి అతడు చెప్పనట్లే చేశాడు. కొద్ది సేపటికే వ్యాపారి బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 99, 910 బదిలీ అయిపోయాయి. మోసాపోయానని గుర్తించిన బాధితుడు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.