Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suicide: రైలు పట్టాలపై యువతి, యువకుడు ఆత్మహత్య.. ప్రేమ జంటగా అనుమానిస్తున్న రైల్వే పోలీసులు

Suicide: ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెంలో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైలు పట్టాలపై

Suicide: రైలు పట్టాలపై యువతి, యువకుడు ఆత్మహత్య.. ప్రేమ జంటగా అనుమానిస్తున్న రైల్వే పోలీసులు
Lovers Suicide
Follow us
Subhash Goud

|

Updated on: Mar 23, 2021 | 1:40 PM

Suicide: ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెంలో ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైలు పట్టాలపై యువతి, యువకుడి మృతదేహాలను రైల్వే పోలీసులు గుర్తించారు. మృతులు ప్రేమ జంటగా రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, మార్చి 19న కూడా ఒంగోలు నగర శివారులో పెళ్లూరు వద్ద ఓ ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. రైల్వే ట్రాక్‌పై మృతదేహాలు పూర్తిగా ఛిద్రమయ్యాయి. గుర్తుపట్టలేని విధంగా ఉన్న మృతదేహాలను చూసి స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే తాజాగా చోటు చేసుకున్న ఘటనతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు.

ఇలా తెలిసీ తెలియని వయసులో ప్రేమలో పడి ఎందరో యువతి, యువకులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రేమ అనే పేరు ఉచ్చులో పడి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. ఎందరో ప్రేమకులు ఇలా ప్రేమించి ఉరి వేసుకోవడం, రైలు పట్టాల కింద పడి ఆత్మహత్యలకు పాల్పడటం జరుగుతూనే ఉన్నాయి.

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. రైలు పట్టాలపై యువతి యువకుడి మృతదేహాలను గుర్తించారు. మృతులు ప్రేమ జంటగా రైల్వే పోలీసులు భావిస్తున్నారు. ఇటీవలే అదే ప్రాంతంలో మరో జంట ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దక్షిణ బంగ్లాదేశ్‌లో భారీ అగ్నిప్రమాదం.. రోహింగ్యా శిబిరంలో మంటలు.. వేలాది మంది నిరాశ్రయులు