Crime News: ఆమ్లెట్ వేయలేదని భార్య గొంతు కోసిన భర్త.. ఆ తర్వాత దారుణంగా..

Wife Murder due to omelette: దేశంలో రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్నాయి. క్షణికావేశంలో కొంతమంది దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా

Crime News: ఆమ్లెట్ వేయలేదని భార్య గొంతు కోసిన భర్త.. ఆ తర్వాత దారుణంగా..
Amlet

Updated on: Feb 20, 2022 | 11:19 AM

Wife Murder due to omelette: దేశంలో రోజురోజుకూ నేరాలు పెరిగిపోతున్నాయి. క్షణికావేశంలో కొంతమంది దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా బీహార్‌లోని సీతామర్హి జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. భార్య ఆమ్లెట్ (omelette) వేయలేదని.. ఓ వ్యక్తి తన భార్యను గొంతు కోసి దారుణంగా చంపాడు. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఆమెను సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడదీసి అక్కడినుంచి పరారయ్యాడు. ఈ షాకింగ్ ఘటన సీతామర్హి జిల్లాలోని సహియారా పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బెలాహిజయ్‌ రామ్‌ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఎస్ఐ రామ్ వినయ్ సింగ్ కుమారుడు అజిత్ సింగ్‌ మద్యానికి బానిస అయ్యాడు. రోజూ మద్యం తాగొచ్చి భార్యను వేధించేవాడు. ఈ క్రమంలో గురువారం కూడా మద్యం ఫుల్లుగా తాగి వచ్చాడు. అనంతరం ఇంటికి వచ్చేటప్పుడు కోడిగుడ్లు తీసుకొచ్చాడు. ఇంటికొచ్చిన అజిత్ సింగ్.. ఆమ్లెట్‌ (Amlet) వేయమని భార్య నీతూదేవికి చెప్పాడు. అయితే.. గురువారం కావడంతో.. ఈ రోజు నాన్ వెజ్ వండనంటూ ఆమె చెప్పింది. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ తరుణంలో అజిత్‌ సింగ్‌ భార్యపై దాడి చేశాడు. ఆపై నీతూదేవి గొంతుకోసి.. (Wife Murder) ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఉరివేసాడు.

అనంతరం ఇటినుంచి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు గాలిస్తున్నారు. మొదట భార్యభర్తల మధ్య ఆమ్లెట్ విషయంలో గొడవ జరిగిందని.. కాసేపటి తర్వాత బెడ్ రూం నుంచి అజిత్ బయటకు వెళ్లిపోయాడని నిందితుడి తండ్రి రామ్ వినయ్ సింగ్ పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు సహియారా పోలీసులు తెలిపారు.

Also Read:

Cheating: కిలాడీ లేడీలు.. చిట్టీలు, పొదుపు పేరుతో రూ.4 కోట్లకు కుచ్చుటోపీ.. స్టేషన్‌కు వందలాది మంది క్యూ..

PF డబ్బులు అకౌంట్లోనే స్ట్రక్ అయిపోయాయా..? అయితే ఎలా విత్ డ్రా చేసుకోవాలో తెలుసా..

Loading...
Unable to load recommendations.
Follow Us