AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నగరంలో పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం

హైదరాబాద్ నగరంలో గంజాయి స్మగ్లింగ్ ముఠాను జూబ్లీహిల్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి పెద్దమొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

నగరంలో పెద్ద ఎత్తున గంజాయి స్వాధీనం
Jyothi Gadda
|

Updated on: Oct 23, 2020 | 5:48 PM

Share

హైదరాబాద్ నగరంలో గంజాయి స్మగ్లింగ్ ముఠాను జూబ్లీహిల్స్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి పెద్దమొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నలుగురు సభ్యుల ఈ ముఠా విశాఖపట్నం, ఒడిశా రాష్ట్రాల నుంచి గంజాయి తీసుకువచ్చి హైదరాబాద్ లో అమ్ముతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ మేరకు జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో డి సి పి ఏఆర్ శ్రీనివాస్ కేసు వివరాలను వెల్లడించారు.

విశాఖపట్నం, ఒడిశా రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసి నగరంలో గంజాయి సప్లై చేస్తున్న నలుగురు సభ్యుల ముఠాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సిద్దిపేట జిల్లా కళ్యాణ్, యాదగిరి నగర్ అబ్రార్ హుస్సేన్, చేతన్ కుమార్ ఉపాధ్యాయ బంజారా హిల్స్, ఇంద్రనగర్ కు చెందిన రమేష్, కృష్ణానగర్ కు చెందిన శ్యాంసుందర్ రెడ్డి ముఠాగా ఏర్పడి గంజాయి విక్రయిస్తున్నట్లుగా వివరించారు.

గురువారం యాదగిరి నగర్ లో నివాసముండే హుస్సేన్, చేతన్ ల గదిలో నిషేధిత గంజాయి ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం అందుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు ఇన్ స్పెక్టర్ సత్తయ్య నేతృత్వంలో తనిఖీలు నిర్వహించారు. చేతన్ హుస్సేన్‌ లను అదుపులోకి తీసుకొని విచారించగా మరో ముగ్గురితో కలిసి గంజాయ్ విక్రయిస్తున్నట్టు ఒప్పుకున్నారని చెప్పారు. దీంతో మిగిలిన ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. ప్రధాన నిందితుడు కళ్యాణ్ పరారీలో ఉన్నాడని తెలిపారు. త్వరలోనే ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేస్తామన్నారు. నిషేధిత గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు అమ్మేవారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని డి సి పి ఏఆర్ శ్రీనివాస్ హెచ్చరించారు.