Couple Doing Black Magic: నల్లకోళ్లు.. నిమ్మకాయలు… స్మశానవాటికలో అర్ధరాత్రి దంపతులు ఏం చేస్తున్నారంటే…

|

Apr 13, 2021 | 11:40 PM

black magic: నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలంలో క్షుద్ర పూజలు చేతబడి కలకలం సృష్టించింది. రాజారామ్‌ నగర్‌ స్మశానవాటికలో అర్ధరాత్రి దంపతులు పూజలు నిర్వహిస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా...

Couple Doing Black Magic: నల్లకోళ్లు.. నిమ్మకాయలు... స్మశానవాటికలో అర్ధరాత్రి దంపతులు ఏం చేస్తున్నారంటే...
Black Magic
Follow us on

నల్లకోళ్లు.. నిమ్మకాయలు. నిర్మానుష్య ప్రదేశం.. చెరువు పక్కన చెట్లతో నిండిపోయింది ఆ ప్రాంతం. అక్కడికి ఎవరూ రారు అనుకున్నారు వారు. కాని ఏదో చేద్దామనుకుంటే ఏదో అయినట్లు వారి బండారం బయటపడింది. క్షుద్రపూజల చేస్తున్నట్లు తెలియడంతో అక్కడకు చేరుకున్న స్థానికులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలంలో క్షుద్ర పూజలు చేతబడి కలకలం సృష్టించింది. రాజారామ్‌ నగర్‌ స్మశానవాటికలో అర్ధరాత్రి దంపతులు పూజలు నిర్వహిస్తూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. స్మశాన వాటిక నుంచి శబ్ధాలు రావడంతో గమనించిన స్థానికులు.. వారిని పట్టుకొని విచారించగా.. క్షుద్రపూజలు చేసినట్లు తేలింది.

వీరిని స్థానికంగా ఓ ఫైల్స్‌ క్లీనిక్‌ నిర్వహించే సమీరా రాయ్‌ అతడి భార్య సిఫ్రా రాయ్‌గా గుర్తించారు. భార్యాభర్తలిద్దరూ నాలుగు నెలలుగా క్షుద్ర పూజలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. శ్మశానవాటిలో క్షుద్ర పూజలు జరిగినట్లు తెలియడంతో స్థానికులు భయందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: Chain Snatcher: ప్రశ్నార్థకంగా మారుతోన్న మానవత్వం.. కనీసం గర్భవతి అని కూడా చూడకుండా.. ఈడ్చుకెళ్లిన దుండగులు..

Partnered: మార్కెట్లోకి సామ్‌సంగ్‌ F12 వచ్చేసింది.. ధర తక్కువ.. ఫీచర్లు మాత్రం అనేకం..