AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime: దారుణంగా కత్తితో పొడిచి చంపి.. మృతదేహాన్ని బ్యాగ్ లో కుక్కి.. సీన్ కట్ చేస్తే

దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్ (Ghaziabad) లో ఓ మహిళ.. తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేసింది. బ్లేడ్, కత్తితో గొంతు కోసి చంపేసింది. అనంతరం మృతదేహాన్ని తాడుతో కట్టి, ప్లాస్టిక్ తో చుట్టి ట్రాలీ బ్యాగ్ లో కుక్కింది....

Crime: దారుణంగా కత్తితో పొడిచి చంపి.. మృతదేహాన్ని బ్యాగ్ లో కుక్కి.. సీన్ కట్ చేస్తే
Crime
Ganesh Mudavath
|

Updated on: Aug 09, 2022 | 4:11 PM

Share

దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని ఘజియాబాద్ (Ghaziabad) లో ఓ మహిళ.. తనతో సహజీవనం చేస్తున్న వ్యక్తిని అత్యంత దారుణంగా హత్య చేసింది. బ్లేడ్, కత్తితో గొంతు కోసి చంపేసింది. అనంతరం మృతదేహాన్ని తాడుతో కట్టి, ప్లాస్టిక్ తో చుట్టి ట్రాలీ బ్యాగ్ లో కుక్కింది. అతని మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించేందుకు ఆటో రిక్షాలో ఎక్కించి.. దగ్గర్లోని రైల్వే స్టేషన్ లో దింపాలని కోరింది. ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చిన పోలీసులు.. లగేజీ బ్యాగ్ లో ఏముందని ప్రశ్నించారు. వారికి ఏదో నచ్చజెప్పేందుకు ఆమె ప్రయత్నించినప్పటికీ వారు వినలేదు. చివరకు బ్యాగ్ ఓపెన్ చేసి చూడగా అందులో ఉన్న మృతదేహాన్ని చూసి పోలీసులు షాక్ అయ్యారు. అతను ప్రమాదవశాత్తు చనిపోయాడని పోలీసులను నమ్మించే ప్రయత్నం చేసింది. వారు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మహిళను అదుపులోకి తీసుకున్నారు. ప్రీత్ శర్మ అనే మహిళ తన 22 ఏళ్ల పార్ట్ నర్ బార్బర్‌ను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఘజియాబాద్ పోలీసులు శర్మపై ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశారు.

కాగా.. ప్రీత్ శర్మకు గతంలో వివాహం జరిగింది. ఆమెకు ఓ కుమార్తె కూడా ఉంది. ఆమె అనారోగ్యంతో చనిపోవడంతో ప్రీత్ శర్మ భర్త నుంచి విడిపోయింది. ఈ క్రమంలో శర్మకు ఫిరోజ్ బార్బర్ తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా సాన్నిహిత్యంగా మారింది. బార్బర్ హత్యకు గల కారణాలను శర్మ వెల్లడించనప్పటికీ.. పెళ్లి విషయంలో ఇద్దరి మధ్య గొడవ తలెత్తి ఈ ఘటనకు దారి తీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రేషన్ కార్డు ఉన్నవారికి రూ.5 లక్షలు.. రేవంత్ సర్కార్ కొత్త స్కీమ్
రేషన్ కార్డు ఉన్నవారికి రూ.5 లక్షలు.. రేవంత్ సర్కార్ కొత్త స్కీమ్
మేడం సార్ మేడం అంతే.. త్రిష మరో ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారా..?
మేడం సార్ మేడం అంతే.. త్రిష మరో ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారా..?
అకస్మాత్తుగా ఆగిన సీఎం చంద్రబాబు కాన్వాయ్.. ఆ తర్వాత
అకస్మాత్తుగా ఆగిన సీఎం చంద్రబాబు కాన్వాయ్.. ఆ తర్వాత
ఓరీ దేవుడో.. ఇంత చిన్న చీమలో అంత పవర్ ఉంటుందా? ఈ నిజాలు తెలిస్తే
ఓరీ దేవుడో.. ఇంత చిన్న చీమలో అంత పవర్ ఉంటుందా? ఈ నిజాలు తెలిస్తే
వరుసగా 4 రోజుల పాటు ఎస్బీఐ బ్యాంక్‌లు బంద్
వరుసగా 4 రోజుల పాటు ఎస్బీఐ బ్యాంక్‌లు బంద్
చదువుల తల్లిని సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి.. వీడియో ఇదిగో..
చదువుల తల్లిని సత్కరించిన మెగాస్టార్ చిరంజీవి.. వీడియో ఇదిగో..
వేడిని తరిమికొట్టే మజ్జిగలో ఈ పొడి వేసుకుని తాగారంటే..
వేడిని తరిమికొట్టే మజ్జిగలో ఈ పొడి వేసుకుని తాగారంటే..
నీట్ పరీక్షకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు: ధర్మేంద్ర ప్రధాన్
నీట్ పరీక్షకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు: ధర్మేంద్ర ప్రధాన్
అయ్యో పాపం కొత్త పెళ్లి కొడుకు..మొదటి రాత్రి భార్యను చూసి పరార్
అయ్యో పాపం కొత్త పెళ్లి కొడుకు..మొదటి రాత్రి భార్యను చూసి పరార్
చంద్రుడి కటాక్షం.. ఈ రాశులకు ధన ధాన్య యోగం ఖాయం!
చంద్రుడి కటాక్షం.. ఈ రాశులకు ధన ధాన్య యోగం ఖాయం!