
దంపతుల మధ్య చెలరేగిన ఘర్షణ ఇద్దరు నిండు ప్రాణాలు తీసింది. తమ అక్కతో గొడవ పడుతున్నాడని.. బావపై ఇద్దరు బావమర్దులు గొడవకు దిగారు. అది పెద్ద ఘర్షణగా మారింది. చివరికి ఆ బావ, తన ఇద్దరు బావమర్దులను హత్య చేశాడు. ఈ దారుణ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జీకే విధి మండలం చింతపల్లి క్యాంపులో చోటు చేసుకుంది. కిముడు కృష్ణ, కిముడు రాజులను వాళ్ల బావ గెన్ను ఒకేసారి ఇద్దరినీ శూలంతో పొడిచి హత్య చేశాడు. ఈ ఘర్షణను అడ్డుకోబోయిన మరో వ్యక్తికి కూడా గాయాలు అయ్యాయి. మృతదేహాలను పోస్టుమర్టం నిమిత్తం సీలేరు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి కేజీహెచ్లో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి