Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, లారీ ఢీ.. తొమ్మిది మంది దుర్మరణం..

|

Oct 07, 2021 | 9:32 AM

Barabanki Road Accident: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గురువారం తెల్లవారుజామున బస్సు, ట్రక్కు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొనడంతో

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, లారీ ఢీ.. తొమ్మిది మంది దుర్మరణం..
Barabanki Road Accident
Follow us on

Barabanki Road Accident: ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకిలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. గురువారం తెల్లవారుజామున బస్సు, ట్రక్కు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొనడంతో తొమ్మిది మంది మరణించారు. 27 మందికి గాయాలయ్యాయి. బారాబంకి దేవ పోలీస్ స్టేషన్ సమీపంలో కిసాన్ పథ్ బాబూరి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ప్రయాణికులను జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు తరలించినట్లు బారాబంకి ఎస్పీ వెల్లడించారు. బస్సు ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌కు వెళ్తుండగా.. లోడువెళ్తున్న లారీని ఢీకొట్టింది.

ఇదిలా ఉంటే.. ఈ సంఘటనపై ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మరణించిన ప్రయాణికుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు. గాయపడిన వారికి చికిత్స కోసం రూ .50 వేలు అందిచనున్నట్లు పేర్కొన్నారు.

Also Read:

Pakistan Earthquake: పాకిస్తాన్‌లో భారీ భూకంపం.. 20 మంది మృతి.. వందలాది మందికి గాయాలు..

Drugs Case: ఎన్ఐఏ చేతికి ముంద్రా పోర్టు డ్రగ్స్ కేసు.. విదేశీ మూలాలపై నజర్..