ఒడిషాలో భారీగా గంజాయి పట్టివేత

ఒడిషాలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మయూర్‌బంజ్‌ జిల్లాలోని తారాకొటి ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. నేషనల్ హైవే -18పై బోట్నోటి పోలీసులు తనిఖీలు..

ఒడిషాలో భారీగా గంజాయి పట్టివేత

Edited By:

Updated on: Aug 18, 2020 | 4:28 PM

ఒడిషాలో భారీగా గంజాయిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మయూర్‌బంజ్‌ జిల్లాలోని తారాకొటి ప్రాంతంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. నేషనల్ హైవే -18పై బోట్నోటి పోలీసులు తనిఖీలు చేపడుతుండగా.. ఓ జీపులో 4.45 క్వింటాల్లో గంజాయిని గుర్తించారు. సోమవారం ఉదయం పక్కా సమాచారం అందడంతో.. తనిఖీలు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలోనే జీపు అనుమానాస్పదంగా వస్తుండటంతో.. తనిఖీలు చేపట్టామని అందులో 4.45 క్వింటాల్లో గంజాయిని గుర్తించి సీజ్ చేశామని తెలిపారు. ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేశామన్నారు. పట్టుబడ్డ గంజాయి విలువ దాదాపు రూ.15 లక్షల వరకు ఉంటుందన్నారు.

Read More :

మేఘాలయకు బదిలీ అయిన గోవా గవర్నర్

బ్రెజిల్‌లో 33 లక్షలు దాటిన కరోనా పాజిటివ్‌ కేసులు