Warangal: దూసుకొచ్చిన ఇసుక లారీ.. ముగ్గురు మహిళా కూలీల దుర్మరణం.. ఐదుగురి పరిస్థితి..

Warangal Road Accident: తెలంగాణలోని హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లా (Hanamkonda) లోని శాయంపేట మండలంలోని మాందారిపేట వద్ద శుక్రవారం

Warangal: దూసుకొచ్చిన ఇసుక లారీ.. ముగ్గురు మహిళా కూలీల దుర్మరణం.. ఐదుగురి పరిస్థితి..
Warangal Accident

Updated on: Apr 08, 2022 | 8:16 AM

Warangal Road Accident: తెలంగాణలోని హన్మకొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లా (Hanamkonda) లోని శాయంపేట మండలంలోని మాందారిపేట వద్ద శుక్రవారం తెల్లవారుజామున కూలీలతో వెళ్తున్న ఆటో ట్రాలీను ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరో 14 మంది గాయపడ్డారు. వీరిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొ్ంటున్నారు.

కాగా.. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో క్షతగాత్రులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. బాధితులు అంతా పత్తిపాక గ్రామానికి చెందినవారని పోలీసులు తెలిపారు. మిరపకాయ కోతలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

మృతులు రేణుక, మంజుల, నిర్మలగా గుర్తించారు. ఉదయం కూలీలతో వెళ్తున్న ట్రాలీ వాహనాన్ని ఇసుక లారీ ఢీకొట్టి పరారైనట్లు కూలీలు పేర్కొంటున్నారు. కాగా.. ఈ ప్రమాదంలో శరీర అవయవాలు తెగి రోడ్డుమీద పడ్డాయి. ఈఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.

Also Read:

Hyderabad Crime: ఉస్మానియా ఆస్పత్రిలో కలకలం.. నాలుగో అంతస్థు నుంచి దూకి రోగి ఆత్మహత్య

Telangana Schools: తెలంగాణ విద్యార్థులకు సూచన.. మరో సారి మారిన పాఠశాల సమయాలు..