AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వ్యాక్సీన్ తయారీకి ఏడాదికి పైగా పట్టవచ్ఛు.. భారత్ బయోటెక్

కరోనా వైరస్ చికిత్సకోసం డెవలప్ చేస్తున్న 'కోవ్యాక్సీన్' తయారీకి ఏడాదికి పైగా కాలం  పడుతుందని భారత్ బయోటెక్ ప్రకటించింది. అంతవరకు తమకు వ్యవధి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆగస్టు 15 నాటికి ఈ వ్యాక్సీన్ అందుబాటులో..

వ్యాక్సీన్ తయారీకి ఏడాదికి పైగా పట్టవచ్ఛు.. భారత్ బయోటెక్
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 05, 2020 | 1:47 PM

Share

కరోనా వైరస్ చికిత్సకోసం డెవలప్ చేస్తున్న ‘కోవ్యాక్సీన్’ తయారీకి ఏడాదికి పైగా కాలం  పడుతుందని భారత్ బయోటెక్ ప్రకటించింది. అంతవరకు తమకు వ్యవధి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరింది. ఆగస్టు 15 నాటికి ఈ వ్యాక్సీన్ అందుబాటులో ఉంటుందని ఐసీఎంఆర్ చేసిన ప్రకటన వివాదాన్ని రేపింది. ఒక డెడ్ లైన్ పెట్టి వ్యాక్సీన్ తయారు చేయాలని కోరడం ఎంతవరకు సబబని కొందరు డాక్టర్లే సందేహాలు వ్యక్తం చేయగా.. విపక్షాలు ఇది రాజకీయంతో కూడుకున్నదని ఆరోపించాయి. కాగా- హ్యూమన్ ట్రయల్స్ పూర్తి చేయడానికి తమకు 15 నెలల సమయం అవసరమవుతుందని భారత్ బయో టెక్ పేర్కొంది. ఈ విషయాన్ని క్లినికల్ ట్రయల్స్ రిజిస్ట్రీకి సమర్పించిన నివేదికలో స్పష్టం చేసింది. ట్రయల్ ప్రోటోకాల్ ప్రకారం తదుపరి ప్రొసీజర్స్ కోసం ఆరు నెలలు పడుతుందని ఈ సంస్థ వెల్లడించింది. అసలు క్లినికల్ ట్రయల్స్ కే  సుమారు మూడు నెలలు పట్టే అవకాశం ఉందని భారత్ బయోటెక్ సంస్థ అధికారులు తెలిపారు.

తొలిదశ క్లినికల్ ట్రయల్స్ కోసం ప్రస్తుతం  వలంటీర్ల రిజిస్ట్రేషన్ జరుగుతోందని వారు చెప్పారు. ఈ ప్రాజెక్టుతో చేతులు కలిపిన కొన్ని సంస్థలకు ఇంకా ‘ఎథికల్ క్లియరెన్స్’ అందవలసి ఉందని వారన్నారు. మొదటి దశలో 18-55 ఏళ్ళ మధ్య వయస్సు గల 375 మందికి, రెండో దశలో 12-65 ఏళ్ళ మధ్య వయస్సు గల 750 మందికి వ్యాక్సీన్ ఇవ్వవలసి ఉంటుంది. తొలి దశ వ్యాక్సీన్ ఇచ్చాక.. 28 రోజుల అనంతరం  దీని సేఫ్టీ, ఇమ్యూనిటీ తెలుస్తుందని ఈ సంస్థ వర్గాలు తెలిపాయి.